‘భీష్మ’ బాగుంది – మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి.. నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా చూసి టీమ్ని అభినందించారు..
మెగాస్టార్ చిరంజీవి.. నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా చూసి టీమ్ని అభినందించారు..
మెగాస్టార్ చిరంజీవి ‘భీష్మ’ సినిమా చూసి, చిత్ర బృందాన్ని అభినందించారు. యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్).
మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ అండ్ హౌస్ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. నితిన్ పెర్ఫార్మెన్స్, వెంకీ టేకింగ్కి మంచి అప్లాజ్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు సినిమా చూసి నితిన్, దర్శకుడు వెంకీకి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also : ‘ప్రశ్నిస్తా.. ప్రశ్నించడానికే వచ్చా.. ఒక్కొక్కరికీ బల్బులు పగిలిపోతాయ్’..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, వెంకీతో కలిసి ‘భీష్మ’ ప్రత్యేక షో వేయించుకుని చూశారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉందని, నితిన్, రష్మికల నటన, వెంకీ కామెడీ టైమింగ్, ఆర్గానికి ఫార్మింగ్ గురించి చెప్పిన విధానం బాగుందని చిరు ప్రశంసించారు. చిరంజీవి తమ సినిమా చూసి అభినందించడం ఆనందంగా ఉందని దర్శకుడ వెంకీ కుడుముల సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Thank you @actor_nithiin anna, @iamRashmika @vamsi84 anna @SitharaEnts and my team for making this possible.. ??? pic.twitter.com/swYyrfGq8M
— Venky Kudumula (@VenkyKudumula) March 15, 2020