Ram Charan : ప్రజలు మమ్మల్ని చూడడానికి రాలేదు.. రామ్‌చరణ్ కోసం వచ్చారు.. సెంట్రల్ మినిస్టర్ కామెంట్స్!

కశ్మీర్ - శ్రీనగర్ లో జరుగుతున్న G20 సదస్సు కార్యక్రమానికి హాజరయిన చరణ్ గురించి సెంట్రల్ మినిస్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. రామ్‌చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అనుకుంటా.

Ram Charan : ప్రజలు మమ్మల్ని చూడడానికి రాలేదు.. రామ్‌చరణ్ కోసం వచ్చారు.. సెంట్రల్ మినిస్టర్ కామెంట్స్!

Minister Jitendra Singh comments on Ram Charan at Srinagar G20 Summit

Ram Charan : RRR తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశంలోని పలు ప్రతిష్టాత్మకమైన సదస్సుల్లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి పాల్గొనే గౌరవాన్ని వరుసగా దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇక తాజాగా కశ్మీర్ – శ్రీనగర్ (Srinagar) లో జరుగుతున్న G20 సదస్సు 2023 లో చరణ్ పాల్గొన్నాడు. నేటి (మే 22) నుంచి మొదలైన ఈ సదస్సు మూడు రోజులు పాటు జరగనుంది. ఈ సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు. ఇండియా తరుపు నుంచి రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత..

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి శ్రీనగర్ చేరుకున్న రామ్ చరణ్.. అక్కడ సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్ లతో కలిసి సదస్సులో పాల్గొన్నాడు. ఇక ఈ సదస్సులో మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) మాట్లాడుతూ.. “రామ్ చరణ్ కూడా ఇక్కడికి వచ్చాడు. అతని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అనుకుంటా. ఇక్కడికి ప్రజలు వచ్చింది కూడా మమల్ని చూడడానికి కాదు. రామ్ చరణ్ చూడడానికే వచ్చారు” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Sarath Babu : శరత్ బాబు, రమాప్రభల కథ ఏంటి.. పెళ్లి అయిందా? సహజీవనమా?

రామ్ చరణ్ ఈ మూడు రోజులు పాటు శ్రీనగర్ లోనే ఉండడనున్నాడు. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో.. అందరు ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అలాంటి సదస్సులో రామ్ చరణ్ కూడా భాగం కావడంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ (Game Changer) సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలే నెలకొన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.