Madhu Kalipu: మిస్ ఇండియా దర్శకుడితో రంగమార్తాండ నిర్మాత కొత్త సినిమా

నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించిన ‘నటసమ్రాట్’ అనే మరాఠీ చిత్రాన్ని ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగులో తెరకెక్కించిన సినిమా ‘రంగ మార్తాండ’.

Madhu Kalipu: మిస్ ఇండియా దర్శకుడితో రంగమార్తాండ నిర్మాత కొత్త సినిమా

New Movie

Madhu Kalipu: నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించిన ‘నటసమ్రాట్’ అనే మరాఠీ చిత్రాన్ని ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగులో తెరకెక్కించిన సినిమా ‘రంగ మార్తాండ’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఈ సినిమాని నిర్మించిన నిర్మాత మధు కాలిపు మరో సినిమాని నిర్మించబోతున్నారు.

ఇటీవల కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మిస్ ఇండియా అనే సినిమాని తీసిన దర్శకుడు నరేంద్రనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుండగా.. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సినిమా రూపొందనుంది. కథకు ప్రాధాన్యం ఉండే సినిమాలు మాత్రమే మా సంస్థలో తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత చెబుతున్నారు.

పెద్ద స్టార్స్‌తో కమర్షియల్, భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మంచి విలువలు, ఎమోషన్స్ ఉన్న సినిమాలని కూడా నిర్మించబోతున్నట్లు నిర్మాత చెబుతున్నారు. రాబోయే అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ‘రంగమార్తాండ’ సినిమాని కూడా ఈ వేసవికి విడుదల చేయబోతున్నారు.

దర్శకుడు నరేంద్రనాథ్‌తో ఈ బ్యానర్‌లో యాక్షన్ డ్రామా తెరకెక్కించబోతున్నారు. తారాగణానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో దర్శక నిర్మతలు ప్రకటించబోతున్నారు.