నాగ్ ‘నిన్నే పెళ్లాడతా’ కు 24 ఏళ్లు.. స్పెషల్ గిఫ్ట్ పంపిన సందీప్ చౌతా..
Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.. ఆయన నటించిన చిత్రాలలో ‘నిన్నేపెళ్లాడతా’ చిత్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. నాగార్జున కెరీర్లోని మరుపురాని చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఆ చిత్రంలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయంటే ఆ పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ‘ఏటో వెళ్లిపోయింది మనసు..’ అని పాడుకోని లవర్ ఉండడంటే.. అతిశయోక్తి కాదు. అంతలా ఆ పాట యూత్లో క్రేజుని సంపాదించుకుంది. అక్టోబర్ 4, 1996లో విడుదలైన ఈ చిత్రం 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కింగ్ నాగార్జునకు సంగీత దర్శకుడు సందీప్ చౌతా ఓ మ్యూజికల్ గిప్ట్ పంపారు.
https://10tv.in/31-years-for-king-nagarjuna-maverick-director-ram-gopal-varmas-iconic-trendsetter-shiva
‘ఏటో వెళ్లి డైరీస్’ అంటూ సంగీత దర్శకుడు సందీప్ చౌతా తనకు అద్భుతమైన గిప్ట్ పంపినట్లుగా తెలుపుతూ.. ఆయనని అభినందించి ధన్యవాదాలు తెలిపారు కింగ్ నాగార్జున. తన మ్యూజిక్ గిఫ్ట్కి వర్క్ చేసిన సందీప్ చౌతా మ్యూజిక్ టీమ్లోని ప్రతి ఒక్కరి పేరు చెబుతూ నాగ్ వారికి అభినందనలు తెలిపారు.
నాగార్జున ట్వీట్ను రీ ట్వీట్ చేసిన అఖిల్ అక్కినేని.. “అద్బుతమైన ఆల్బమ్ మరియు అద్బుతమైన సంగీత దర్శకుడు.. ‘నిన్నేపెళ్లాడతా’ 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీమ్ అందరికీ శుభాకాంక్షలు” అని తెలిపారు.
నాగార్జున ట్వీట్ను రీ ట్వీట్ చేసిన సమంత అక్కినేని ‘‘25 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ‘నిన్నేపెళ్లాడతా’ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి’’ అని కామెంట్ చేశారు.
Music is universal !! yetto Velli diaries by Sandeep Chowta.. thank you my dear friend for this wonderful gift on the 25th year of #NinnePelladutha!! ?❤️@NammaMusic listen to it ? https://t.co/iJgPqDNMGv pic.twitter.com/GogMgWKOIw
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 4, 2020