మైత్రీ బ్యానర్‌లో బాబాయ్-అబ్బాయ్ సినిమాలు..

మైత్రీ బ్యానర్‌లో బాబాయ్-అబ్బాయ్ సినిమాలు..

Balakrishna and NTR: వరుస విజయాలతో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఎదిగింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను హీరో హీరోయిన్లుగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘ఉప్పెన’ ప్రమోషన్స్‌లో భాగంగా రెండు క్రేజీ సినిమాల గురించి మాట్లాడారు నిర్మాతలు.

నటసింహా నందమూరి బాలకృష్ణ, ఇటీవల ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని తెలిపారు. బాలయ్య ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని గోపిచంద్ మంచి కథ తయారుచేస్తున్నారని, బాలయ్య-బోయపాటి సినిమా తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేస్తామని అన్నారు.

NBK 107

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీని రూపొందించనున్నామని కూడా ప్రకటించారు మైత్రీ అధినేతలు. ఎన్టీఆర్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, ప్రశాంత్ ‘సలార్’ పూర్తయిన తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని చెప్పారు. ఒకే సంస్థలో బాబాయ్-అబ్బాయ్ సినిమాలు చేస్తున్నారనే వార్త తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తారక్, కొరటాల ‘జనతా గ్యారేజ్’ మైత్రీ సంస్థలోనే తెరకెక్కింది.

NTR 31