Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన ‘మనం’ చిత్ర దర్శుకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో నటిస్తున్న ‘థ్యాంక్ యూ’ మూవీ కోసం ప్రేక్షకులు....
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన ‘మనం’ చిత్ర దర్శుకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో నటిస్తున్న ‘థ్యాంక్ యూ’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రానుండటంతో చైతూ కెరీర్లో బెస్ట్ రొమాంటిక్ మూవీగా ఈ సినిమా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
Naga Chaitanya : జులై 8న ‘థ్యాంక్యూ’ చెప్తాను అంటున్న చైతూ..
థ్యాంక్ యూ చిత్ర టీజర్ను ఈ నెల 25న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చైతూ అండ్ టీమ్ వెల్లడించారు. టీజర్ రిలీజ్కు సంబంధించిన అప్డేట్ను ఓ వీడియో ద్వారా వెల్లడించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో చైతూ సరికొత్త లుక్లో కనిపిస్తుండగా, విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా కథను ప్రముఖ రైటర్ బివిఎస్.రవి అందించడంతో, థ్యాంక్ యూ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని అక్కినేని అభిమానులు అంటున్నారు.
Naga Chaitanya : విక్రమ్ దర్శకత్వంలో ‘దూత’గా భయపెట్టనున్న నాగచైతన్య
చైతూ సరసన ఈ సినిమాలో ముగ్గురు బ్యూటీలు రొమాన్స్ చేస్తుండటంతో మరోసారి రొమాంటిక్ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును చై తెచ్చుకుంటాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో చైతూ సరసన రాశి ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్లు హీరోయిన్లుగా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి థ్యాంక్ యూ టీజర్కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే మే 25 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాను జూలై 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
— chaitanya akkineni (@chay_akkineni) May 23, 2022