MAA Elections: విష్ణు తప్పుకోవడం ఎందుకు.. బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు!

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నికల వివాదంపై రోజుకొకరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎన్నికలలో పోటీచేస్తామన్న ఐదుగురు వారి వారి అభిప్రాయాలు వారికంటే ఇప్పటికే ఉన్న అధ్యక్షుడు.. సభ్యులు మరోరకంగా ఉన్నారు. ఇక పెద్దలు ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పినా.. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ.. ఒక్కొక్కరు బయటకి వచ్చి ఒక్కోలా మాట్లాడడం ఇది మరింత వివాదంగా మారుతుంది.

MAA Elections: విష్ణు తప్పుకోవడం ఎందుకు.. బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు!

Maa Elections

MAA Elections: తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నికల వివాదంపై రోజుకొకరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎన్నికలలో పోటీచేస్తామన్న ఐదుగురు వారి వారి అభిప్రాయాలు వారికంటే ఇప్పటికే ఉన్న అధ్యక్షుడు.. సభ్యులు మరోరకంగా ఉన్నారు. ఇక పెద్దలు ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పినా.. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ.. ఒక్కొక్కరు బయటకి వచ్చి ఒక్కోలా మాట్లాడడం ఇది మరింత వివాదంగా మారుతుంది.

ఈసారి ఎన్నికలలో పోటీకి దిగాలని భావించిన మంచు విష్ణు ఈ మధ్యనే ఓ బహిరంగ లేఖ ద్వారా తన మనోభావాన్ని వెలిబుచ్చగా దానిని కొందరు స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరుగా.. ఇండ్రస్ట్రీలోని అతిపెద్ద కుటుంబాలలో ఒకటైన నందమూరి కుటుంబం నుండి బాలకృష్ణ గురువారం ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన సంగతి తెలిసిందే.

మా అసోసియేషన్ కోసం బిల్డింగ్ కట్టేందుకు పూర్తి బాధ్యతను తానే భరిస్తానని విష్ణు చెప్పిన దానిని స్వాగతించిన బాలకృష్ణ.. ఇన్నాళ్లుగా ఈ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారని ఘాటుగా ప్రశ్నించారు. లోకల్ నాన్ లోకల్ అంశం పెద్దది కాదన్న బాలకృష్ణ అసలు ఫస్ట్ క్లాస్ ఫ్లైట్‌లలో ఫండ్ రైజింగ్ కోసం అమెరికా వెళ్లి తీసుకుని వచ్చిన డబ్బంతా ఏమి చేశారంటూ నిలదీశారు. దీంతో బాలయ్య వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. కాగా ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు కౌంటర్ వ్యాఖ్యలు చేశారు.

ఓ తెలుగు న్యూస్‌ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో నాగబాబు.. ‘గతంలో మురళీ మోహన్ గారు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ నుంచి మా బిల్డింగ్ గురించి ప్రయత్నాలు జరుగుతున్నా.. ఎవరూ దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. దీనికి గతంలో పని చేసిన ప్రెసిడెంట్లు అందరూ బాధ్యులే’ అని చెప్పుకొచ్చారు. ఇక మంచు విష్ణు ఎన్నికల నుంచి తప్పుకుంటానడం సరైన నిర్ణయం కాదన్న నాగబాబు.. ఆయన పోటీలో ఉండాలి. జనాలను బెదిరించినప్పుడే ఏకగ్రీవాలు అవుతుంటాయన్నారు. ‘మా’కోసం విష్ణు బిల్డింగ్ కడతాను అన్నారు.. కానీ ఆ స్థలం ఎక్కడ ఉందో.. ఎక్కడి నుంచి తెస్తారో చెబితే బాగుండేదని అన్నారు. మరి ఈ వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి!