ఈ జ‌న్మ‌కిది చాలు: మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌!

మెగాస్టార్ చిరంజీవి తనకు ఆపరేషన్ చేయించడం మరియు మెగా దంపతులు పరామర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రాజనాల నాగలక్ష్మీ..

  • Published By: sekhar ,Published On : April 13, 2020 / 09:52 AM IST
ఈ జ‌న్మ‌కిది చాలు:  మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌!

మెగాస్టార్ చిరంజీవి తనకు ఆపరేషన్ చేయించడం మరియు మెగా దంపతులు పరామర్శించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రాజనాల నాగలక్ష్మీ..

గుంటూరు జిల్లాకు చెందిన మెగా అభిమాని  రాజ‌నాల నాగ‌ల‌క్ష్మికు స్టార్ హాస్పిట‌ల్‌లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో  మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ఎంత‌గానో స‌హ‌కారం అందించారు. కాగా సోమ‌వారం రాజనాల నాగలక్ష్మి గారిని స్టార్ హాస్ప‌టిట‌ల్స్ వారు ఐసీయూ నుంచి  ప్ర‌త్యేక గ‌దికి త‌ర‌లించారు. ఈ సందర్భంగా డాక్ట‌ర్లు ఆమె ఆరోగ్యం బాగుంద‌ని తెలిపారు. అలాగే రాజ‌నాల  నాగ‌ల‌క్ష్మి స్పృహలోకి రాగానే  చిరంజీవి  శ్రీమతి సురేఖ  స్వయంగా వీడియో కాల్ ద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితి యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. 
ఈ సంద‌ర్భంగా చిరంజీవి దంప‌తులు ప్రస్తుతం మీరు ఆరోగ్యంగా ఉన్నార‌ని.. మీకు మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. అనంత‌రం నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ: ‘ఇది క‌లా..నిజ‌మా? నా న‌డిచే దైవం శ్రీ చిరంజీవి గారు స్వ‌యంగా నాతో మాట్లాడ‌ట‌మా? దీన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీమ‌తి సురేఖ గారు కూడా కుంటుంబ స‌భ్యురాలిగా నాతో ఎంతో ప్ర‌ేమ‌తో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ జ‌న్మ‌కిది చాలు. ముక్కోటి దేవ‌త‌లు చిరంజీవి గారిని..వారి కుటుంబాన్ని చ‌ల్ల‌గా చూడాల‌ని, మ‌న‌స్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాన’ని ఉద్వేగంతో, ఆనంద బాష్పాల‌తో మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌కి బ‌దులిచ్చారామె.

Read Also : లాక్‌డౌన్ వేళ వంటింట్లో బాలయ్య అక్కా, బావల బిర్యానీ తయారీ..

అలాగే మెగాస్టార్ చిరంజీవి.. నాగలక్ష్మీ విష‌యాన్ని స‌మ‌యానికి తన దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైద‌రాబాద్ వ‌ర‌కూ రావ‌టానికి ఏర్పాట్లు చేసిన బి. దిలీప్ గారికి, ఇంతదూరం ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల‌కి.. ఆపరేషన్ చేసిన డాక్టర్ గోపిచంద్ గారికి ఇత‌ర సిబ్బందికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.