‘వాట్స్‌ ఇన్‌ యువర్‌ కిడ్స్‌ డబ్బా’- పిల్లలకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పిన నమ్రత..

  • Published By: sekhar ,Published On : July 14, 2020 / 12:06 PM IST
‘వాట్స్‌ ఇన్‌ యువర్‌ కిడ్స్‌ డబ్బా’- పిల్లలకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పిన నమ్రత..

ఈ లాక్‌డౌన్ టైంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పలు రకాలు ఛాలెంజ్‌లు క్రియేట్ చేస్తున్నారు. వారు చేస్తూ మరికొంత మందికి ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘వాట్స్‌ ఇన్‌ యువర్‌ కిడ్స్‌ డబ్బా’ ఛాలెంజ్‌ అనేది ఒకటి నడుస్తోంది.

అందులో భాగంగా తమ పిల్లలకు ఇష్టమైనవి ఏంటో చెప్పాలన్నమాట. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా నమ్రతను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా నామినేట్‌ చేశారు.

‘‘ఛోలె మసాలా, బెండకాయ వేపుడు, ఎల్లో రైస్‌… మా పిల్లల గౌతమ్‌, సితారకు ఇష్టమైన ఫుడ్‌! వారానికి ఒక్కసారైనా పిల్లల మెనూలో ఇవి ఉండాల్సిందే’’ అని నమ్రతా మహేశ్‌ అన్నారు. ‘‘పిల్లలకు ఆరోగ్యకరమైన, సాధారణ భోజనం అందిస్తా. వంట చేసేటప్పుడు తప్పకుండా అనుసరించే మరో చిట్కా… ఒక స్ఫూన్‌ స్వచ్ఛమైన నెయ్యి లేదా కోల్డ్‌-ప్రెస్సెడ్‌ కోకోనట్‌ ఆయిల్‌ ఉపయోగించడం. ఇలా చేయడం వల్ల చిన్నారులకు ఆహారం సులభంగా జీర్ణమవుతుంది’’ అని నమ్రతా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

https://www.instagram.com/p/CCkgtKajOvL/?utm_source=ig_web_copy_link