Namratha – Upasana: క్రిస్‌మస్‌ సెలబ్రేషన్.. దుబాయ్‌లో ఉపాసన-నమ్రత!

టాలీవుడ్ లో హీరోలే కాదు హీరోల భార్యామణులు కూడా దోస్తీ అంటూ పాటలు పాడేసుకుంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా కలిసి విహార యాత్రలు చేసే వీళ్ళు పండగలు, స్పెషల్ డేస్ లలో కలిసి మెలిసి..

Namratha – Upasana: క్రిస్‌మస్‌ సెలబ్రేషన్.. దుబాయ్‌లో ఉపాసన-నమ్రత!

Namratha Upasana

Namratha – Upasana: టాలీవుడ్ లో హీరోలే కాదు హీరోల భార్యామణులు కూడా దోస్తీ అంటూ పాటలు పాడేసుకుంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా కలిసి విహార యాత్రలు చేసే వీళ్ళు పండగలు, స్పెషల్ డేస్ లలో కలిసి మెలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పటిల్స్ డైరెక్టర్ ఉపాసన యంగ్ హీరోల భార్యలతో మంచి స్నేహ బంధాన్ని మైంటైన్ చేస్తుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్, నారా బ్రాహ్మణి వంటి వారితో కనిపించిన ఉపాసన ఈసారి మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ తో కనిపించింది.

Singer Revanth: పెళ్లి కొడుకైన సింగర్ రేవంత్.. ఎంగేజ్‌మెంట్ ఫోటోలు

ఉపాసన, నమ్రతా ఇద్దరూ దుబాయ్ లో క్రిస్‌మస్‌ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. దుబాయ్‌ ఎక్స్‌పో 2020లో భాగంగా అక్కడికి వెళ్లిన ఈ ఇద్దరూ కలిసి లంచ్ పార్టీకి వెళ్లారు. ఉపాసన ఇచ్చిన లంచ్ పార్టీకి నమత్ర, ఆమె సోదరి శిల్పా, మనీశ్‌ మల్హోత్రాలు హాజరవగా.. దీనికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. లంచ్ ట్రీట్ ఇచ్చిన ఉపాసనకు నమ్రత కృతజ్ఞతలు చెప్తూ ఫోటోలు పోస్ట్ చేస్తే.. మళ్ళీ త్వరలోనే హైదరాబాద్ లో కలుద్దాం అంటూ ఉపాసన బదులిచ్చింది.

Bollywood Heroins: కొత్త సంవత్సరం.. బీ టౌన్ లవ్ బర్డ్స్ డేరింగ్ డెసిషన్స్!

‘ఇష్టమైనవారితో రుచికరమైన విందు.. ఈ మధ్యాహ్నాన్ని ఎంతో ఎంజాయ్‌ చేశాను. ఉపాసన.. నీలా అద్భుతమైన వంటకాలతో విందును ఎవరూ ఇవ్వలేరు. మనీశ్‌.. నిన్నిక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. మనమంతా మరోసారి హైదరాబాద్‌లో ఇలాంటి పార్టీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అది కూడా త్వరలోనే.. అందరికీ క్రిస్‌మస్‌ శుభాకాంక్షలు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది నమ్రత. ‘నిజంగా చాలా ఎంజాయ్‌ చేశాం. లవ్లీ మీటింగ్‌. త్వరలోనే హైదరాబాద్‌లో కూడా ప్లాన్‌ చేద్దాం’ అని బదులిచ్చింది ఉపాసన. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.