బి.గోపాల్-బాలయ్య కాంబినేషన్ మళ్లీ రిపీట్!

  • Published By: venkaiahnaidu ,Published On : January 8, 2020 / 02:32 PM IST
బి.గోపాల్-బాలయ్య కాంబినేషన్ మళ్లీ రిపీట్!

నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ గురించి సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయడు లాంటి సూపర్‌ హిట్ సినిమాలు వచ్చాయి. చివరగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత ‘హర హర మహదేవ ‘ అనే సినిమాని మొదలుపెట్టినప్పటికీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

ఇక ప్రస్తుతం బి గోపాల్ సినిమాలు అయితే చేయడం లేదు. చివరగా ఆయన గోపీచంద్ హీరోగా ఆరడుగుల బుల్లెట్టు సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ సినిమా విడుదల కాలేదు. అయితే ఇప్పుడు ఈ సీనియర్‌ డైరెక్టర్‌ సరికొత్త కథతో నందమూరి నటసింహంతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథ చర్చలు కూడా జరిగాయని, బాలయ్య కూడా దీనికి ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్పి ఉంది.

ప్రస్తుతం తనకు సింహా,లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన యాక్షన్ డైరక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో బాలయ్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ముహూర్తపు సన్నివేశాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిమిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. క్యాథరిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. కానీ ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదలైన రూలర్ సినిమా బాలయ్య ఫ్యాన్స్ ని నిరాశపరిచింది.