ఒకే వేదికపై మరోసారి నందమూరి హీరోలు
నందమూరి హీరోలు ఒకే వేదికపైకి రావడం అంటే వారి అభిమానులకు పండుగ రోజే… నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. వీళ్లు ముగ్గురు ఒక వేదిక మీదకు రావడం వారి అభిమానులకు కొన్నిరోజుల వరకు ఒక కళ. అయితే అరవింద సమేత సినిమా సక్సెస్ మీట్కి బాలకృష్ణ రావడంతో వారి కోరిక అప్పుడు తీరింది. తర్వాత కథానాయకుడు ఈవెంట్లో కలిశారు.
అయితే, అప్పటి నుంచి వీరు ముగ్గిరిని ఒక వేదికపై చూసే అవకాశం రాలేదు అనుకునే అభిమానుల కోరిక తీరబోతుంది. బాబయ్ బాలయ్య, అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వెగెశ్న సతీష్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంత మంచి వాడవురా’ మూవీ జనవరి 15వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ 8వ తేదీన జెఆర్సీ ఫంక్షన్ హాల్లో ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఎన్టీఆర్ ఓ అతిథిగా హాజరు ఈ వేడుకకు హాజరు కాబోతుతున్నారు.
అయితే ఈ ఫంక్షన్కు బాలకృష్ణ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా హిట్ లేక సతమతం అవుతున్న కళ్యాణ్ రామ్.. ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య బాబాయ్ కూడా వస్తే బాగుంటుందని ఆయనను పిలిచాడట. అంతేకాదు ఈ సినిమా నిర్మాణ భాగస్వామి శివలెంక కృష్ణప్రసాద్ కు బాలయ్యకు మంచి సంబంధాలు ఉన్నాయి. బాలయ్యతో ఆయన సినిమాలు నిర్మించారు. ఆ అనుబంధం కూడా ఫంక్షన్ కు బాలయ్య వచ్చే అవకాశాలను పెంచాయట. చూడాలి మరి ముగ్గురు మరోసారి అభిమానులకు కనులవిందు చేస్తారేమో?