Nayanathara : హనీమూన్ నుంచి రాగానే షూటింగ్కి వెళ్లిపోయిన నయన్
స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ని గత కొనేళ్ళుగా ప్రేమించి ఇటీవల జూన్ 9న వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత..................
Nayanathara : స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ని గత కొనేళ్ళుగా ప్రేమించి ఇటీవల జూన్ 9న వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత మొదట తిరుమలకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఇక హనీమూన్ కి థాయిలాండ్ వెళ్లారు ఈ కొత్త దంపతులు. దాదాపు వారం రోజులు థాయిలాండ్ లో ఎంజాయ్ చేశారు. థాయిలాండ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ డైరెక్టర్ విగ్నేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. తాజాగా థాయ్లాండ్కు హానీమూన్ వెళ్లిన ఈ కొత్త జంట తిరిగి వచ్చారు.
Director Maruthi : అలా చేస్తే పక్క భాషల నటుల్ని తెచ్చుకోవాల్సిన పని లేదు..
అయితే హానీమూన్ నుంచి వచ్చిరాగానే నవ వధువు నయనతార షూటింగ్ సెట్లో అడుగు పెట్టేసింది. నయనతార జవాన్ సినిమాతో షారుఖ్ సరసన బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న జవాన్ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. నయన్ షెడ్యూల్స్ ఉండటంతో హానీమూన్ నుంచి తిరిగొచ్చిన వెంటనే షూటింగ్ కోసం ముంబై వెళ్ళిపోయింది. దీంతో నయనతారకి వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి అభినందిస్తున్నారు.