రూల్స్ పాటించండి.. ఫ్యామిలీని బాగా చూసుకోండి..

కరోనా ఎఫెక్ట్- ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియో బైట్ రిలీజ్ చేసిన ‘నిశ్శబ్దం’ మూవీ టీమ్..

  • Published By: sekhar ,Published On : March 18, 2020 / 01:38 PM IST
రూల్స్ పాటించండి.. ఫ్యామిలీని బాగా చూసుకోండి..

కరోనా ఎఫెక్ట్- ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియో బైట్ రిలీజ్ చేసిన ‘నిశ్శబ్దం’ మూవీ టీమ్..

గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్ -19) గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు.

తాజాగా ‘నిశ్శబ్దం’ మూవీ టీమ్ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రభుత్వం చెప్పిన రూల్స్ కచ్చితంగా పాటించాలని, రోజుకి సగటున 8 సార్లు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, తప్పని సరిగా శానిటైజర్ వాడాలని సూచించారు..

Read Also : అరేబియన్ గుర్రం అదిరింది.. భమ్ చికి భమ్ భమ్ చెయ్యి బాగా .. కంటికి యోగా మంచిదేగా!..

కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని.. కనీస జాగ్రత్తలు పాటించడం మనందరి బాధ్యత అంటూ అనుష్క, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, దర్శకుడు హేమంత్ మధుకర్ తదితరులు తెలియచేశారు. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది.