Macherla Niyojakavargam: నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ వెండితెరపై ఫ్లాప్.. బుల్లితెరపై రెస్పాన్స్ ఏమిటో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లాస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించగా, ఈ సినిమాలో నితిన్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాడు. ఇక ఈ సినిమా పాటలకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, బాక్సాఫీస్ వద్ద మంచి క్రేజ్‌తో ఈ సినిమాను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Macherla Niyojakavargam: నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ వెండితెరపై ఫ్లాప్.. బుల్లితెరపై రెస్పాన్స్ ఏమిటో తెలుసా?

Nithiin Macherla Niyojakavargam Gets Good TRP Rating

Macherla Niyojakavargam: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లాస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించగా, ఈ సినిమాలో నితిన్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశాడు. ఇక ఈ సినిమా పాటలకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో, బాక్సాఫీస్ వద్ద మంచి క్రేజ్‌తో ఈ సినిమాను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Macherla Niyojakavargam: ఓటీటీలో కూడా రాని సినిమా.. నేరుగా బుల్లితెరపై.. కానీ!

కానీ, సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఈ సినిమా వెండితెరపై విజయాన్ని అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలోని పాటలను ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు. కాగా, ఈ చిత్రాన్ని ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెరపై టెలికాస్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు బుల్లితెరపై ఎలాంటి టీఆర్పీ రేటింగ్ వచ్చిందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి వచ్చిన టీఆర్పీ రేటింగ్ వివరాలను తాజాగా వెల్లడించారు.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం వారికే ఎక్కువగా నచ్చుతుంది – కృతి శెట్టి

మాచర్ల నియోజకవర్గం చిత్రానికి బుల్లితెరపై 4.8 టీఆర్పీ రేటింగ్ దక్కింది. ఒక ఫ్లాప్ మూవీకి ఇది మంచి టీఆర్పీ రేటింగ్ అని చెప్పాలి. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న సినిమాగా మాచర్ల నియోజకవర్గం బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించగా, వెన్నెల కిషోర్ అల్టిమేట్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.