నిత్యామీనన్, అభిషేక్ బచ్చన్ జంటగా వెబ్ సీరీస్…ఫస్ట్ లుక్ రిలీజ్  

  • Published By: bheemraj ,Published On : June 12, 2020 / 08:33 PM IST
నిత్యామీనన్, అభిషేక్ బచ్చన్ జంటగా వెబ్ సీరీస్…ఫస్ట్ లుక్ రిలీజ్  

వెండి తెరపై అలరించిన హీరోయిన్ నిత్యామీనన్ ఇప్పుడు డిజిటల్ లోనూ కనిపించనుంది. నిత్యామీనన్, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటిస్తున్న వెబ్ సీరీస్ ‘బ్రీత్ : ఇన్ టు దీ షాడోస్’. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానున్న ఈ సిరీస్ మొదటి సీజన్ ఇప్పటికే విడుదలైంది. ఇప్పుడు రెండో సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అభిషేక్ విడుదల చేశారు. 

తను నీడలో ఉంటూ కావాల్సిన దాని కోసం ఎదురుచూస్తోంది. ‘బ్రీత్ : ఇన్ టు దిషాడోస్’ అని పోస్టు పెట్టారు. జులై 10న ఈ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇందులో అమిత్ సాద్, సయామీ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది నిత్యామీనన్ తొలిసారి నటిస్తున్న వెబ్ సిరీస్.

ఈ సందర్భంగా నిత్యామీనన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. మొదటి సీజన్ కు తీసిన మయాంక్ శర్మ రెండో భాగానికి కూడా డైరెక్షన్ వహించారు. ‘బ్రీత్’ సీజన్ 1 ను సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఓ సాధారణ వ్యక్తి అసాధరణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవడం చుట్టూ సాగే కథ ఇది. ఆర్.మాధవన్ నటించిన ఆ సీరిస్ అందరినీ ఆకట్టుకుంది.