NTR 31 : ‘సలార్’ రెండు పార్టులు! అందుకే బుచ్చిబాబు లైన్‌లోకి వచ్చాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 31వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది..

NTR 31: రాజమౌళి డైరెక్ట్ చేసిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికి బాక్సాఫీస్ బరిలో రికార్డుల రచ్చ కంటిన్యూ అవుతుండేది.

NTR 30 : ట్రెండింగ్‌లో తారక్ 30

ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాను షేక్ చేసేస్తారు ఫ్యాన్స్. పర్సనల్, ప్రొఫెషనల్.. మేటర్ ఏదైనా వైరల్ చేసేస్తారు. ఇప్పడు ట్విట్టర్‌లో #NTR30 తో పాటు #NTR31 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

BIMBISĀRA: పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది.. బింబిసార హై ఓల్టేజ్ టీజర్

తారక్ తన తర్వాత సినిమా (NTR 30) కొరటాలతో చేస్తున్నాడు. తర్వాత ‘కె.జి.యఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌లో సినిమా చెయ్యాలి. అప్పటికి ‘సలార్’ కంప్లీట్ అయిపోతుంది. ప్రశాంత్ మూవీ అయ్యాక ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేద్దామనుకున్నారు. కట్ చేస్తే, ఇప్పుడు లెక్క మారింది.

Lakshmi Pranathi : సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య ప్రణతి.. లవ్లీ హస్బెండ్ అంటూ ఫస్ట్ పోస్ట్..

దానికి కారణం ‘సలార్’ సినిమా రెండు పార్టులుగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కథ ప్రకారం రెండు భాగాలుగా చెప్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీంతో తారక్, ప్రశాంత్ కంటే ముందే బుచ్చిబాబు సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఈ న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది.

Jr NTR : ‘మావయ్య గారు’ అంటూ తారక్ ట్వీట్..

ట్రెండింగ్ వార్తలు