ఎన్టీఆర్ కథానాయకుడు : బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
చిత్తూరు / అనంతపురం : ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ కావడంతో బాలకృష్ణ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. సినిమా చూసిన అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇందులో బాలకృష్ణ నటించలేదు.. పూర్తిగా జీవించారంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుసుకోవడం భవిష్యత్ తరాలకు కూడా ఎంతో అవసరమంటున్నారు ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు. తిరుపతిలో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.
అనంతలో…
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలతో ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. సినిమాలో అడుగడుగునా బాలకృష్ణ ఎన్టీఆర్ను మరపించారంటున్నారు అభిమానులు. ఇందులో రాజకీయాల ప్రస్తానకంటే.. ఎన్టీఆర్ జీవిత చరిత్రకే ఎక్కువ ప్రాధన్యత ఉందటున్నారు అనంతపురం జిల్లా బాలకృష్ణ అభిమాలు.