NTR : ఫిల్మ్‌నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ నందు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

NTR : ఫిల్మ్‌నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..

Ntr Sr

NTR :  మే 28న ఇవాళ తెలుగు వారి యుగపురుషుడు, మహానేత, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ సారి ఆయన శత జయంతి కూడా కావడంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ ని ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయగా ఉదయం నుంచే అభిమానులు, సెలబ్రిటీలు ఆ మహనీయుడికి నివాళులు అర్పించేందుకు క్యూ కట్టారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ నందు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా తరలి రానున్నారు.

ఈ కార్యక్రమానికి నందమూరి తారకరామారావు గారి కుటుంబ సభ్యులు
శ్రీనందమూరి జయకృష్ణగారు
శ్రీమతి& శ్రీ గారపాటి లోకేశ్వరి గణేశ్వరారవు గారు
శ్రీ నందమూరి మాధవి మణి సాయికృష్ణ గారు
శ్రీమతి లక్ష్మి హరికృష్ణ గారు
శ్రీనందమూరి మోహన కృష్ణ గారు
శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావుగారు
శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరిగారు
శ్రీమతి&శ్రీ నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు గారు
శ్రీనందమూరి రామకృష్ణ గారు
శ్రీమతి&శ్రీ కంటమనేని ఉమ మహేశ్వరి శ్రీనివాస ప్రసాద్ గారు
శ్రీనందమూరి జయశంకర్ కృష్ణ గారు రానున్నారు.

NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి

అలాగే శ్రీమతి పరిటాల సునీత, పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరవనున్నారు. ఈ విగ్రహాన్ని శ్రీనందమూరి మోహన కృష్ణ గారు సమర్పించగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ మాగంటి గోపీనాథ్, మరియు ఎమ్మెల్యే, శ్రీ దానం నాగేందర్ ఆవిష్కరించనున్నారు. మే 28న ఉదయం 10 గంటలకు ఫిలిం నగర్ లోని ఆనంద్ సినీ సర్వీసెస్ దగ్గర ఈ విగ్రహావిష్కరణ జరగనుంది.