‘ఓ మనిషి నీవెవరు’ డిసెంబర్‌లో విడుదల

  • Published By: sekhar ,Published On : November 4, 2019 / 06:08 AM IST
‘ఓ మనిషి నీవెవరు’ డిసెంబర్‌లో విడుదల

రిజ్వాన్ క‌ల్‌షాన్, సుమ‌న్, చ‌ల‌ప‌తిరావు, హ‌రి, త‌రుణ్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం ‘ఓమ‌నిషి నీవెవ‌రు’.. గాడ్ మినీస్ర్టీస్ స‌మ‌ర్ప‌ణ‌లో, స్వ‌ర్ణ క్రియేష‌న్స్ ప‌తాకంపై కృష్ణ మూర్తి, రాజ్ కుమార్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ర్ణ కుమారి దొండ‌పాటి నిర్మించారు. ప్ర‌భాక‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్‌లో అయిదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా హీరో సుమ‌న్ మాట్లాడుతూ : ‘ఈ సినిమాలో ఓ పాత్ర ఉందని నిర్మాత గారు చెప్ప‌గానే ఆలోచించ‌కుండా ఒక అదృష్టంగా భావించి చేశాను. చాలా వైవిథ్యంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. న‌టులంద‌రు ఎంతో క‌మిట్‌మెంట్‌తో నటించారు. ఇలాంటి సినిమాలు  చేయాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఏసు పాత్ర‌కు రిజ్వాన్ బాగా సూట‌య్యాడు. ఇటీవల విడుదలయిన పాట‌ల్లో మంచి ఫీల్ ఉంది. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకొస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది’ అని అన్నారు.

Read Also : ‘వి’ : ఉగాది నుంచి ఆట, వేట మొదలు

చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ : ‘సెన్సార్ పూర్తి చేసుకున్న మా సినిమా డిసెంబర్‌లో అయిదు భాషల్లో రిలీజ్ అవుతుంది. మా నిర్మాత గోపాల‌కృష్ణ గారు నా మీద నమ్మకంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో రీసెర్చ్ చేసి హార్డ్ వర్క్‌తో తీశాను. యూనిట్ అంతా బాగా కోపరేట్ చేశారు. సినిమా బాగా వ‌చ్చింది. ఈ సినిమాతో  చాలా మంది కొత్త న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌రిచ‌యం అవుతున్నారు. ఇదంతా జీస‌స్ బ్ల‌ెస్సింగ్ వ‌ల్లే జ‌రిగింది. సినిమాని అన్ని వర్గాల ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా’ అని అన్నారు.

రిజ్వాన్ కల‌్‌షాన్ మాట్లాడుతూ : ‘న‌టుడిగా నాకు తెలుగులో తొలి చిత్ర‌మిది. ఏసు గొప్ప‌దనాన్ని చెప్పే సినిమాలో న‌టించడం చాలా సంతోషాన్నిచ్చింది’ అన్నారు. స్ర్కీన్‌ప్లే ర‌చ‌యిత, నిర్మాత గోపాల‌కృష్ణ దొండ‌పాటి మాట్లాడుతూ : ‘ఏసుప్రభు ఆశీర్వచనాల వలన ఈ సినిమాని పక్కా ప్లానింగ్‌తో నిర్మించాను. ఇటీవలే సెన్సార్ పూర్తి అయింది. క్లీన్ “U” సర్టిఫికెట్  జారీ చేసిన సెన్సార్ వారు ఈ సినిమాని మెచ్చుకోవడం మాకు తొలి విజయంగా భావిస్తున్నాను. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాము. అన్ని ఏరియాల నుంచి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఏసు  గొప్ప‌దనాన్ని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం. అందరూ తప్పక చూసి మా ప్రయత్నాన్ని సక్సెస్ చెయ్యండి’ అని అన్నారు.

ప‌ల్లె విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి, డింపు ఫ‌ణికుమార్, జెన్ని, జూనియ‌ర్ రేలంగి, బి.హెచ్.ఈ.యఎల్. ప్ర‌సాద్, ఆకెళ్ల‌, సంగీత్ ఆనంద్, మునీశ్వ‌ర‌రావు, జాను, అరుణ త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి స్ర్కీన్‌‌ప్లే : గోపాల‌కృష్ణ  దొండ‌పాటి, మాట‌లు : జి. విజ‌య, పాట‌లు : విన‌య్ కుమార్, కొరియోగ్ర‌ఫీ :  వేణు మాస్ట‌ర్, క‌ళ‌ : సుభాష్, ఎడిటింగ్ : వి. నాగిరెడ్డి, ఛాయాగ్ర‌హ‌ణం : సూర్య భ‌గ‌వాన్ మోటూరి, చీఫ్- కోడైరెక్ట‌ర్ : జి. శివ ప్ర‌సాద్ రెడ్డి, స‌హ నిర్మాత‌ : జ‌ంప‌న దుర్గా భ‌వానీ. నిర్మాత : గోపాల‌కృష్ణ దొండ‌పాటి.