ఆది అదరగొట్టాడు.. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టీజర్
వినాయకుడు, కేరింత వంటి ఫీల్ గుడ్ సినిమాలతో విజయాలు అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయికిరణ్ అడవి.
వినాయకుడు, కేరింత వంటి ఫీల్ గుడ్ సినిమాలతో విజయాలు అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయికిరణ్ అడవి.
వినాయకుడు, కేరింత వంటి ఫీల్ గుడ్ సినిమాలతో విజయాలు అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయికిరణ్ అడవి. కేరింత తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా చేస్తున్న సాయికిరణ్.. ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. సాయికుమార్ కొడుకు ఆది హీరోగా నటిస్తున్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాకు సంబంధించిన టీజర్ ను తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం
గతకొన్ని సినిమాలుగా సరైన హిట్ లేకుండా సతమవుతున్న ఆది ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ‘నువ్వు చేసిన తప్పు వల్ల కొన్ని ప్రాణాలు పోయాయి’ అంటూ పై అధికారి ఆదిని తిడుతున్న డైలాగ్తో సినిమా టీజర్ మొదలవగా.. ‘కశ్మీర్ పాకిస్థాన్ది.. వెంటనే వదిలేసి వెళ్లిపోండి’ అంటూ ఉగ్రవాదులు భారత సైన్యంను బెదిరించినట్లుగా ఒక సీన్ టీజర్ లో ఉంది.
Also Read : రాజకీయం కాదా! : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు
‘ఓ భారతీయుడు ఎప్పుడూ ఇచ్చిన మాటను తప్పడు’ అని ఆది చెబుతున్న డైలాగ్ టీజర్ లో హైలైట్ గా అనిపించింది. NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండో అర్జున్ పాత్రలో ఆది నటించగా.. సాషా చెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యానరేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా విడుదలైన ఈ టీజర్కు మంచి స్పందన లభిస్తుంది.
Also Read : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు