‘జైహిందే మా జీహాద్’ : ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ట్రైలర్

దసరా సందర్భంగా.. ఆది, సాషా చెత్రి (ఎయిర్ టెల్ మోడల్), నిత్యా నరేష్ ప్రధాన తారాగణంగా సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో రూపోందుతున్న‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 7, 2019 / 07:23 AM IST
‘జైహిందే మా జీహాద్’ : ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ట్రైలర్

దసరా సందర్భంగా.. ఆది, సాషా చెత్రి (ఎయిర్ టెల్ మోడల్), నిత్యా నరేష్ ప్రధాన తారాగణంగా సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో రూపోందుతున్న‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

ఆది, సాషా చెత్రి (ఎయిర్ టెల్ మోడల్), నిత్యా నరేష్ ప్రధాన తారాగణంగా సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో రూపోందుతున్న యాక్షన్ థ్రిల్లర్..‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’.. కార్తీక్ రాజు, పార్వ‌తీశం, మ‌నోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్రల్లో నటించగా.. రైటర్ అబ్బూరి రవి ఘాజీబాబా అనే తీవ్రవాదిగా కనిపించనున్నారు.

దసరా సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో.. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’.. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది నటించాడు. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగే ఆపరేషన్ సినిమాలో హైలెట్ కానుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.

Read Also : అక్టోబర్ 18న ‘ఆవిరి’..

ట్రైలర్ చివర్లో ‘ఒక్కసారి జైహిందే మా జీహాద్ అయితే.. కుదీ సోచ్‌లో’ అంటూ ఆది చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ విడుదల కానుంది. మ్యూజిక్ : శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ : జైపాల్ రెడ్డి, ఎడిటింగ్ : గ్యారీ, నిర్మాణం : వినాయకుడు టాకీస్, యూ&ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్..