Oscars 2023 : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్కార్ అఫీషియల్ ఫాలో అయ్యేది ఆ ఇద్దరి ఇండియన్ హీరోలనే..

ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని అందుకోడానికి ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా పోటీ పడుతుంటారు. అటువంటి అవార్డుని మన తెలుగు సినిమా RRR గెలుచుకొని చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో నాటు నాటు పాటతో ఇండియన్ సినీ ఇండస్ట్రీ పేరు గట్టిగా వినిపించింది. కాగా..

Oscars 2023 : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్కార్ అఫీషియల్ ఫాలో అయ్యేది ఆ ఇద్దరి ఇండియన్ హీరోలనే..

ntr and shah rukh khan

Oscars 2023 : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని అందుకోడానికి ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా పోటీ పడుతుంటారు. అటువంటి అవార్డుని మన తెలుగు సినిమా RRR గెలుచుకొని చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో నాటు నాటు పాటతో ఇండియన్ సినీ ఇండస్ట్రీ పేరు గట్టిగా వినిపించింది. ఆస్కార్ గెలుచుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్ లో మన సినిమాలకు ఒక దారి ఏర్పడింది. ఈ క్రమంలోనే రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో తీస్తున్న మూవీని హాలీవుడ్ మేకర్స్ తో కలిసి చేయబోతున్నాడు.

RRR : కాలభైరవ పై ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. సారీ చెప్పిన కాలభైరవ!

ఇక అసలు విషయానికి వస్తే ఆస్కార్ అఫీషియల్ హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇండియాకి సంబంధించిన ఇద్దరి హీరోలను మాత్రమే ఫాలో అవుతుంది. ఆ హీరోలు ఎవరంటే RRR తో గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న ఎన్టీఆర్ ఒకరైతే, మరొకరు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇండియా నుంచి ఈ ఇద్దరి హీరోలను మాత్రమే ఆస్కార్ అఫీషియల్ హ్యాండిల్ ఫాలో అవుతుంది. దీంతో ఎన్టీఆర్ అండ్ షారుఖ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో.. ది రియల్ గ్లోబల్ స్టార్స్ అంటూ సందడి చేస్తున్నారు.

RRR : ఆస్కార్‌తో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన RRR టీం.. జై హింద్ అంటూ రాజమౌళి..

కాగా RRR టీం నేడు ఆస్కార్ తో హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో హైదరాబాద్ శంషాబాద్ చేరుకున్న రాజమౌళి, కీరవాణికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక మీడియాతో ఏమి మాట్లాడని రాజమౌళి ‘జై హింద్’ అనే ఒక్క మాటతో అందరి మనసులను దోచుకున్నాడు. రామ్ చరణ్ ఏమో హైదరాబాద్ లో కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. నేడు దేశంలో జరిగే బిగ్గెస్ట్ స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంకి చరణ్ కి ఆహ్వానం అందడంతో డైరెక్ట్ ఢిల్లీ చేరుకున్నాడు.