Pavitra Lokesh : సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి..

తాజాగా పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులని కలిసి.. తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని, ఆ ఖాతాల్లోంచి తన పరువు పోయేలా ఇష్టమొచ్చిన..............

Pavitra Lokesh : సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి..

Pavitra Lokesh

Pavitra Lokesh :  సీనియర్ నటి పవిత్ర లోకేష్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. దివంగత కన్నడ నటుడు మైసూరు లోకేశ్‌ కుమార్తె పవిత్ర లోకేశ్‌. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో అమ్మ, అత్త లాంటి క్యారెక్టర్స్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్‌ ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. ఇటీవల పవిత్ర టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేశ్‌ను పెళ్లి చేసుకోబోతుంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. వాటిపై నరేశ్ సీరియస్ గా స్పందించినా పవిత్ర మాత్రం స్పందించలేదు.

Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!

తాజాగా పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులని కలిసి.. తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని, ఆ ఖాతాల్లోంచి తన పరువు పోయేలా ఇష్టమొచ్చిన పోస్టులు పెడుతున్నారని, నా గురించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఇలాంటి అకౌంట్స్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులని కోరింది పవిత్ర. ఆమె ఆరోపణల మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు.