Pawan Kalyan: సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకుని పవన్ ఎమోషనల్ ట్వీట్

ప్రముఖ లెజెండరీ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటిని....

Pawan Kalyan: సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకుని పవన్ ఎమోషనల్ ట్వీట్

Pawan Kalyan Emotional Words Remembering Sirivennela Seetharamashastry

Pawan Kalyan: ప్రముఖ లెజెండరీ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటిని ఇటీవల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీతారామశాస్త్రిని గుర్తుకు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. సీతారామశాస్త్రి గారి అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు అంటూ పవన్ కళ్యాణ్ సిరివెన్నెలను గుర్తుకు చేసుకున్నాడు.

ఈ సందర్భంగా పవన్ చాలా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘‘కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు. భౌతికంగా లేకపోయినా తను సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడు. పంచ భూతాలలో కలసిపోయినా రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప కవి ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారు. ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి. సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా విడుదలైన ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి చూశాక – ఆ అక్షర తపస్విని మొదటిసారి ‘రుద్రవీణ’ సినిమా సమయంలో కలసిన సందర్భం గుర్తుకు వచ్చింది.

Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!

అన్నయ్య చిరంజీవి నటించిన ఈ సినిమాకు నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి నేను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకొన్నాను. ఆ సందర్భంలో శాస్త్రి గారిని తరచూ కలిసేవాడిని. ఆ చిత్రంలో ‘చుట్టూపక్కల చూడరా చిన్నవాడా’ పాటలో చివరి చరణం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది. గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది. ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా. తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే – అనే ఈ పంక్తులు ఇప్పటికీ నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. నన్ను నిలబెట్టిన ఈ సమాజానికి రుణం తీర్చుకోవడం నా విధిగా భావిస్తాను.

జనసేన పార్టీ పక్షాన కౌలు రైతులకు భరోసా ఇచ్చి ఆర్థిక సాయం చేయడం కూడా నా బాధ్యతే. మనకున్నది పదిమందికీ పంచాలి – అది ప్రకృతి ధర్మం అనే విషయాన్నీ రుద్రవీణలోని ‘తరలిరాద తనే వసంతం..’ అనే పాటలో వినిపించారు. ‘పంచే గుణమే పోతే – ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కథ – దిశనెరుగని గమనము కద’ అనే పంక్తులలోని భావాన్ని అందరం తెలుసుకోవాలి. ఏరు దాటాకా అవసరం తీరిందని తెప్ప తగలబెట్టే ఆలోచనలతో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఒకసారి శ్రీ శాస్త్రి గారి సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి. సీతారామ శాస్త్రి గారు రచనలన్నిటిలో కవిగా ఆయనలోని సామాజిక బాధ్యత కనిపిస్తుంది. సమాజానికీ బాధ్యతలు గుర్తు చేసే దృక్పథం అందులో నిక్షిప్తమై ఉంటుంది.

Pawan Kalyan : సముద్రఖని దర్శకత్వంలో పవన్ సినిమా.. మరో రీమేక్..

ఆయన అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు. శాస్త్రి గారి రచనలలోని గాఢతను చెబుతూ కవిగా ఆయన్ని మరింత అర్థం చేసుకొనేలా చేశారు త్రివిక్రమ్ గారు. ఆయనకు నా కృతజ్ఞతలు. ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ అందిస్తున్న ‘తానా’ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు.’’ అంటూ పవన్ సీతారామశాస్త్రి గారి జయంతి సందర్భంగా గుర్తుకు చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.