Pawan Kalyan : 700 రూపాయలతో మ‌ద్యం కొని 5రూపాయ‌ల‌తో సినిమాకు వెళ్లండ‌ని చెబుతున్నారు : పవన్ కళ్యాణ్

ఏపీలోని సినిమా సమస్యలపై పవన్ కళ్యాణ్ గతంలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సినిమా సమస్యలపై పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న......

Pawan Kalyan : 700 రూపాయలతో మ‌ద్యం కొని 5రూపాయ‌ల‌తో సినిమాకు వెళ్లండ‌ని చెబుతున్నారు : పవన్ కళ్యాణ్

Pawan Jagan

Pawan Kalyan :  ఏపీలో కొన్ని నెలలుగా సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలపై చర్చలు నడిచాయి. సినీ పెద్దలు ఏపీ సీఎం, మంత్రులని కలిసి వారి సమస్యలని వినిపించారు. అయినా ఏపీ ప్రభుత్వం ఇటీవల సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. ఈ బిల్లు సినీ పరిశ్రమకి, థియేటర్లకు నష్టాన్ని కలిగించేలా ఉందే తప్ప ఎవరికీ లాభం చేకూర్చేలా లేదు. ఈ బిల్లుతో ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలు ఉండవని, టికెట్ రేట్లు భారీగా తగ్గించామని తెలిపారు.

Pushpa : ‘పుష్ప’ ప్రమోషన్స్ చేస్తున్న డేవిడ్ వార్నర్.. తగ్గేదేలే అంటున్న బన్నీ

అయితే ఏపీలోని సినిమా సమస్యలపై పవన్ కళ్యాణ్ గతంలో ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సినిమా సమస్యలపై పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలో విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఉక్కు పరిరక్షణ రిలే దీక్షని నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి ఏపీ సమస్యలపై తీవ్రంగా గళమెత్తారు. ఈ నేపథ్యంలో మరోసారి సినిమా టికెట్లపై కూడా మాట్లాడారు.

Kashish Khan : ‘అనుభవించు రాజా’ హీరోయిన్.. కవ్విస్తున్న కాశిష్‌ఖాన్

ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ సినిమా సమస్యల గురించి మాట్లాడుతూ.. ”నా ఒక్క‌డిపై ఉన్న కోపంతో సినీ ఇండ‌స్ట్రీపై ప‌గ సాధిస్తున్నారు. నా సినిమాలను ఆపేస్తే భయపడను, అంత పిరికి వాడిని కాదు. పంతానికి దిగితే నా సినిమాల‌ను ఉచితంగా ఆడిస్తాన‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పారదర్శకత అంటే అన్ని విషయాల్లో ఉండాలని, కొన్ని విషయాల్లో మాత్రమే కాదు” అని చెప్పారు.

Akhanda : ‘అఖండ’ కోసం అదిరిపోయే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఇతనే..

”సినిమా టికెట్ల‌లో పార‌ద‌ర్శ‌క‌త లేదు అని రేట్లు తగ్గించి పరిశ్రమని మీ గుప్పిట్లో పెట్టుకున్నారు. మ‌రి ప్ర‌భుత్వం అమ్మే మ‌ద్యం అమ్మ‌కాల్లో పార‌ద‌ర్శ‌క‌త ఉందా? అని ప్ర‌శ్నించారు. 700 రూపాయలతో మ‌ద్యం కొని 5రూపాయ‌ల‌తో సినిమాకు వెళ్లండ‌ని చెబుతున్నారు. ఇదెక్క‌డి న్యాయం అంటూ పవన్ కళ్యాణ్ మరోసారి సినిమా టికెట్ల విషయంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు ఈ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలో అన్నీ భారీ సినిమాలు రిలీజ్ ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇలా మాట్లాడటంతో ఏపీ ప్రభుత్వం ఈ సారి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఆలోచిస్తున్నారు.