మరోసారి ఛాన్స్: పవన్ కళ్యాణ్తో నివేథా థామస్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా ఆడంబరాలు లేకుండా సింపుల్గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. బాలీవుడ్ సినిమా ‘పింక్’ తెలుగు రీమేక్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. హిందీలో అమితాబ్, తమిళంలో అజీత్ చేసిన పవర్ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఫిబ్రవరిలో సెట్స్పైకి తీసుకుని వెళ్లనున్నారు.
హిందీ, తమిళ్ బాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, తెలుగులో దిల్ రాజుతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న 40వ సినిమా ఇది కాగా.. ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’ చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేయబోతున్నారు. థమన్ సంగీతం అందించనుండగా సినిమాను సమ్మర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం టాప్ హీరోయిన్ని సెలెక్ట్ చేసుకున్నారు చిత్ర నిర్మాతలు. పింక్ సినిమాలో ముఖ్యమైన పాత్రను తాప్సీ చెయ్యగా.. తమిళ సినిమా నేర్కొండ పార్వైలో శ్రద్ధా శ్రీనాథ్ ఆ పాత్రను చేశారు. అయితే తెలుగులో పింక్ రీమేక్లో నివేథా థామస్ని చిత్రయూనిట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఆమెను నిర్మాతలు సంప్రదించగా.. ఆమె ఇందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇంతకుముందు కూడా నివేథా థామస్కు పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చింది అయితే అప్పుడు అది చెల్లెలు క్యారెక్టర్ కావడంతో ఆమె ఒప్పుకోలేదు.
ఇక ఈ సినిమా 2020వ సంవత్సరం జనవరి నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుండగా… ముందు నివేథా థామస్తో షూటింగ్ జరిగిన తర్వాత షూటింగ్లో పవన్ కళ్యాణ్ జాయిన్ కానున్నారు. ఇక సినిమా కథలో కూడా హీందీ పింక్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి కొన్ని సన్నివేశాల్లో కూడా మార్పులు చెయ్యాలని పవన్ కళ్యాణ్ దర్శకులకు చెప్పారట. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాల ప్రస్తావన సినిమాలో ఉండే అవకాశం ఉంది.