మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వీడియోను ట్వీట్ చేసిన పీఎం మోడీ
రామ్ చరణ్ వీడియోను ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు. లాక్ డౌన్ పాటిస్తూ వెలుగుల్ని ప్రసరింపచేయాలని ట్వీట్ లో కోరారు
రామ్ చరణ్ వీడియోను ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు. లాక్ డౌన్ పాటిస్తూ వెలుగుల్ని ప్రసరింపచేయాలని ట్వీట్ లో కోరారు
కరోనాపై పోరులో భాగంగా ఆదివారం (ఏప్రిల్ 5, 2020) రాత్రి 9 గంటలకు అందరూ 9 నిమిషాల పాటు వెలుగు వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. ప్రధాని పిలుపుకు అందరూ సంఘీభావం తెలపాలని టాలీవుడ్ స్టార్స్ విజ్ఞప్తి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. దానిపై హీరో రామచరణ్ రామ్ చరణ్ వీడియో చేశారు.
‘‘లాక్ డౌన్ నిర్ణయాన్ని గౌరవించి పాటిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల గర్విస్తున్నాను. వారందరిపైనా నా ప్రేమాభిమానాలు ఉంటాయి. ఇప్పుడదే స్ఫూర్తితో రేపు రాత్రి 9 గంటలకి తొమ్మిది నిమిషాల పాటు మన ఇళ్లలో ఉన్న లైట్లన్నీ ఆపేసి దీపాలు వెలిగిద్దాం. మన ప్రధానమంత్రి గారి మాట పాటిద్దాం. కరోనా లేని భారత్ను సాధిద్దాం’’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అయితే రామ్ చరణ్ వీడియోను శనివారం (ఏప్రిల్ 4, 2020) ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు. లాక్ డౌన్ పాటిస్తూ వెలుగుల్ని ప్రసరింపచేయాలని ట్వీట్ లో కోరారు.
‘‘మన గౌరవ భారత ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు ఆదివారం (ఏప్రిల్ 5, 2020) రాత్రి సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు మనందరం మన కుటుంబ సభ్యులతో కలిసి, మన ఇంటి బయటికి వచ్చి.. కొవ్వొత్తులుగానీ, సెల్ఫోన్ ప్లాష్లుగానీ, అలాగే టార్చిలైట్లను వెలిగించి సంఘీభావాన్ని తెలుపుదాం. కరోనాని తుదముట్టించడానికి భారతీయులందరూ ఒక్కటయ్యారనే సందేశాన్ని ప్రపంచదేశాలకు చాటి చెబుదాం. రండి.. భారత ప్రధాని పిలుపుకు స్పందించండి. కరోనాని అంతమొందించండి. అందరూ ఒక్కటై వెలుగును నింపండి. జైహింద్..’’ అని చెబుతూ.. ఓ వీడియోని చిరంజీవి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
‘‘జనతా కర్ఫ్యూ రోజున మనమందరం చూపించిన సంఘీభావం మళ్లీ ఇంకొకసారి చుపెడదాం.. దేశమంతా ఒకటే అని ఐకమత్యంతో కరోనాపై మనం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని తెలియ చేద్దాం’’.. అంటూ అక్కినేని నాగార్జున తెలిపారు.
Well pointed.
Follow the lockdown.
Spread brightness.
Together we will all defeat COVID-19. #IndiaFightsCorona https://t.co/IyakhwYrwI
— Narendra Modi (@narendramodi) April 4, 2020