Ponniyin Selvan : 2021 దీపావళికి మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్..

కరోనా వ్యాప్తి కారణంగా సృజనాత్మక దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ ఆపేశారు..

Ponniyin Selvan : 2021 దీపావళికి మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్..

Ponniyin Selvan: కరోనా వ్యాప్తి కారణంగా సృజనాత్మక దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ ఆపేశారు. దాదాపు ఏడు నెలలు విరామం తర్వాత త్వరలో షూటింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఇటీవల చిత్ర వర్గాలు తెలిపాయి. దీపావళి 2021 నాటికి ఫస్ట్ పార్ట్ విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. శ్రీలంకలో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారు.


మణిరత్నం యొక్క మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ,  త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, మరియు నిలల్‌గల్ రవి తదితరులు నటిస్తున్నారు.. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు..