Poornodaya Creations : మళ్ళీ సినిమాలు మొదలుపెట్టిన స్వాతిముత్యం, సాగరసంగమం నిర్మాతలు.. జాతిరత్నాలు డైరెక్టర్‌తో

స్వాతి ముత్యం, సాగర సంగమం, స్వర్ణ కమలం, స్వయం కృషి లాంటి సినిమాలతో ఎన్నో జాతీయ‌ అవార్డులు పొందిన పూర్ణోదయా క్రియేషన్స్ మళ్ళీ సినిమాలు................

Poornodaya Creations : మళ్ళీ సినిమాలు మొదలుపెట్టిన స్వాతిముత్యం, సాగరసంగమం నిర్మాతలు.. జాతిరత్నాలు డైరెక్టర్‌తో

Poornodaya

Poornodaya Creations :   స్వాతి ముత్యం, సాగర సంగమం, స్వర్ణ కమలం, స్వయం కృషి లాంటి సినిమాలతో ఎన్నో జాతీయ‌ అవార్డులు పొందిన పూర్ణోదయా క్రియేషన్స్ మళ్ళీ సినిమాలు మొదలు పెడుతుంది. ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ఎవరూ ఆ బ్యానర్ నుంచి సినిమాలు తీయలేదు. 7 ఏళ్ళ క్రితం ఆయన కూడా మరణించారు. తాజాగా ఆయన మనవరాలు శ్రీజ పూర్ణోదయా క్రియేషన్స్, శ్రీజ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సినిమాలు తీయడానికి ముందుకొచ్చింది.

Mahesh Babu : స్టేజి మీద మ మ మహేష్ మాస్ డ్యాన్స్.. కెరీర్ లోనే ఫస్ట్ టైం అభిమానుల కోసం..

 

శ్రీ‌జ తమ తొలి చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ అనే టైటిల్‌ను ప్రకటించగా ఈ టైటిల్ లాంచ్ సోమ‌వారం రాత్రి ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. మహానటి ద‌ర్శకుడు ఈ టైటిల్ ని నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ‘జాతిర‌త్నాలు’ డైరెక్టర్ అనుదీప్ ఇవ్వగా అనుదీప్ దగ్గర పని చేసిన వంశీ, ల‌క్ష్మీనారాయ‌ణలు ద‌ర్శకులుగా ప‌రిచ‌యం అవుతున్నారు. పూర్ణోదయా క్రియేషన్స్ మళ్ళీ ఇలా సినిమాలు మొదలు పెట్టడంతో పలువురు సినీ ప్రముఖులు శ్రీజని అభినందిస్తున్నారు.