ప్రభాస్.. మూడు సినిమాలు.. రూ. 900 కోట్లు!

  • Published By: sekhar ,Published On : August 18, 2020 / 09:03 PM IST
ప్రభాస్.. మూడు సినిమాలు.. రూ. 900 కోట్లు!

టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. డార్లింగ్ డైరెక్ట్ బాలీవుడ్ మూవీగా ‘ఆదిపురుష్‌’ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తుంటే ఇకమీదట అన్నీ భారీ సినిమాలే చేస్తాడేమో అనిపిస్తోంది. ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రభాస్ సినిమాలు, వాటి బడ్జెట్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.



Radhe Shyam

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వీటి బడ్జెట్ అక్షరాలా రూ.900 కోట్లు. రిలీజ్ నాటికి ప్రమోషన్స్ వంటివాటితో కలిపి మరో 100 కోట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా బడ్జెట్ 150 కోట్ల రూపాయలు.. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించబోయే సైన్స్ ఫిక్షన్ మూవీ బడ్జెట్ 250 కోట్లు అనుకుంటున్నారు.



Prabhasఈరోజు ప్రకటించిన ‘ఆదిపురుష్’ బడ్జెట్ అయితే ఏకంగా 500 కోట్లు.. ప్రభాస్ కెరీర్లో తెరకెక్కుతున్న ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఇదే. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. హిందీ, తెలుగు భాష‌ల్లో తెరకెక్క‌నున్న ఈ చిత్రాన్ని తమిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అనువాదం చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో రూపొదించ‌నుండ‌టం విశేషం. ఇలా మూడు సినిమాల బడ్జెట్ కలిపితే రూ.900 కోట్లు అవుతోంది. ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.



Adipurush