Adipurush: 9 భాషలు.. 20 వేల థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్?

బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్.. దేశ విదేశాల్లోనూ అభిమానులు సంపాదించుకున్నాడు. ‘సాహో’గా హాలీవుడ్ రేంజ్ సినిమాతో నుంచి అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా..

Adipurush: 9 భాషలు.. 20 వేల థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్?

Adipurush

Adipurush: బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్.. దేశ విదేశాల్లోనూ అభిమానులు సంపాదించుకున్నాడు. ‘సాహో’గా హాలీవుడ్ రేంజ్ సినిమాతో నుంచి అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న ప్రభాస్.. బాలీవుడ్డ్ స్టార్ హీరోలని కూడా దాటేసి ఇండియాలోనే టాప్ లో ఉన్నాడు. టాప్ 50 ఏషియన్ ప్రముఖుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ప్రభాస్ ఇప్పుడు రాబోయే అన్ని సినిమాలను కూడా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడు.

Telugu Dubbing Films: బాలీవుడ్ స్క్రీన్స్‌పై తెలుగు డబ్బింగ్ సినిమాల దాడి!

ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K సినిమాలను వరసగా పూర్తిచేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇందులో రాధేశ్యామ్ ఇప్పటికే విడుదలకి సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం దక్షణాది నుండి ఉత్తరాది వరకు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ సినిమాని ప్రభాస్ కెరీర్లో ఎన్నడో లేనంతగా మొత్తం 20 వేల థియేటర్లలో విడుదల చేయనున్నారని సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది.

Apsara Rani: కోరిక తీరిస్తేనే ఛాన్స్.. క్యాస్టింగ్ కౌచ్‌పై అప్సర!

ఇప్పటి వరకు మన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రకరకాల బాషలలో విడుదల అవుతున్నా ఒక్క ఇంగ్లీష్ లో మాత్రం విడుదల కాలేదు. అయితే.. ఈసారి ప్రభాస్ ఆ వెలితిని కూడా తీర్చేయనున్నాడని చెప్తున్నారు. ముందుగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే స్పిరిట్ సినిమాను ఇంగ్లీష్ తో సహా తొమ్మిది బాషలలో విడుదల చేయాలనున్నారు. కానీ.. ఇప్పుడు అంతకంటే ముందుగా ఆదిపురుష్ సినిమాను తొమ్మిది బాషలలో విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇది ఎంతవరకు నిజమన్నది చూడాల్సి ఉంది.

Kiara Advani: అందానికే జెలసీ పుట్టించేలా కైరా వయ్యారాలు!

కాగా, ఇండియన్ సినిమా చరిత్రలో ఆదిపురుష్ అత్యధికంగా విజువల్ ఎఫెక్ట్ వినియోగించిన సినిమా కానుందని చెప్తున్నారు. ఏకంగా ఎనిమిది వేలకు పైగా విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా, కృతి సనన్ సీత పాత్ర నటిస్తుంది. ఇక రామాయణ కథలోని మెయిన్ విలన్ రోల్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించే పనిలో ఉన్నారట.