Radhe Shyam: పండక్కి బొమ్మ పడుతుందా లేదా?.. కన్ఫ్యూజన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్!

న్యూఇయర్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేద్దామనుకుని.. కోట్ల బడ్జెట్ తో, అంతకుమించిన ప్రమోషన్లతో సినిమాకి రెడీ అయ్యింది. కానీ కోవిడ్ దెబ్బకి మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యింది.

Radhe Shyam: పండక్కి బొమ్మ పడుతుందా లేదా?.. కన్ఫ్యూజన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్!

Radhe Shyam

Radhe Shyam: న్యూఇయర్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేద్దామనుకుని.. కోట్ల బడ్జెట్ తో, అంతకుమించిన ప్రమోషన్లతో రిలీజ్ కి రెడీ అయ్యింది. కానీ కోవిడ్ దెబ్బకి మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. వారం గ్యాప్ లోనే రిలీజ్ కు రెడీ అవుతున్న రాధేశ్యామ్ రిలీజ్ మీద కన్ ఫ్యూజన్ లో ఉన్నారు ఆడియన్స్. కోవిడ్ దెబ్బకి ప్రభాస్ సినమా కూడా పోస్ట్ పోన్ అవడం గ్యారంటీ అని ఇప్పటికే సోషల్ మీడియాలో రూమర్స్ స్పీడప్ అవుతున్నాయి. అయితే ఇంతకీ ప్రభాస్ అండ్ టీమ్ ఏమనుకుంటున్నారన్నది ఆసక్తిగా మారింది.

Daniel Craig: జేమ్స్ బాండ్‌కి బుద్దుందా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

ట్రిపుల్ఆర్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. ఆ సినిమా కంటే ఎక్కువగా ఇప్పుడు అందరి కాన్సన్ ట్రేషన్.. రాధేశ్యామ్ మీదే ఉంది. కోవిడ్ కి భయపడి ధియేటర్లు క్లోజ్ అవుతాయని.. ధియేటర్లు లేకపోతే కలెక్షన్లు రావని ట్రిపుల్ రిలీజ్ కి వారం ముందు పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ కూడ ఇదే రూట్లో వెళుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

Siri-Shanmukh: బాధలో దీప్తి.. జెస్సీ, సిరితో షన్ను ఎంజాయ్‌మెంట్!

ట్రిపుల్ఆర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయినా.. రాధేశ్యామ్ మాత్రం ఎట్టి పరిస్తితుల్లో అనుకున్న డేట్ నే.. జనవరి 14నే ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్ట్రాంగ్ గా.. ట్రిపుల్ఆర్ పోస్ట్ పోన్ అనౌన్స్ చేసిన రోజే అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. అయితే ట్రిపుల్ఆర్ కూడా రిలీజ్ కు కొన్ని గంటల ముందు వరకూ జనవరి 7న రిలీజ్ చేసి తీరుతాం అంటూ కన్ఫామ్ చేసింది. అయితే టైమొచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. దాంతో సినిమా పోస్ట్ పోన్ చేసింది. అయితే సినిమా రిలీజ్ చేస్తామంటున్నకూడా.. ట్రిపుల్ఆర్ లానే రాధేశ్యామ్ కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది అంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది.

Radhe Shyam: కరోనాతో జాగ్రత్త.. రాధేశ్యామ్ దర్శకుడి ట్వీట్ దుమారం!

రాధేశ్యామ్ కూడా రిలీజ్ కాదనుకుంటూ.. ఇప్పటికే మిగతా సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకే వస్తున్నాయి. మరో వైపు అసలు సినిమా రిలీజ్ ఉంటుందా..? ఉండదా అంటూ కన్ ఫ్యూజన్ లో ఉన్నారు ఆడియన్స్. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ రోజురోజోకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులతో ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలకు కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేసిన రాధేశ్యామ్.. బాలీవుడ్ లో మార్కెట్ ని మిస్ చేసుకునే ఛాన్స్ తీసుకోదు.

Radhe Shyam: ఎక్కడో ఏదో టెన్షన్.. జనవరి 14నే రాధేశ్యామ్ వస్తుందా?

కానీ.. సినిమా ఇలాంటి పరిస్తితుల్లో రిలీజ్ చేస్తే.. గ్యారంటీగా కలెక్షన్లురావు. ఈ సిచ్యువేషన్లో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అనుకుంటూ వస్తున్న వార్తలకి.. రాధేశ్యామ్ పీ.ఆర్ టీమ్.. ఇప్పటి వరకూ సినిమాని పోస్ట్ పోన్ చేసే ఉద్దేశ్యం లేదు.. అనుకున్నట్టుగానే జనవరి 14న పండగ రోజు ప్రేక్షకుల ముందుకు రావడం మాత్రం ఖాయం అంటూ క్లారిటీ ఇచ్చారు. టీమ్ ఎంత ఖచ్చితంగా చెబుతున్నా.. ఎక్కడో ఆడియన్స్ మాత్రం రిలీజ్ మీద డౌట్ పడుతూనే ఉన్నారు.