ప్రభాస్, హృతిక్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ముహూర్తం ఫిక్స్..
బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అఫ్ ది Decadeకి ముహూర్తం ఖరారైంది.
రెబల్స్టార్ ప్రభాస్ రేపు ఉదయం 07:11 గంటలకు తన ఫ్యాన్స్కి ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు.
దీంతో ప్రభాస్ రేపు ఏం అప్డేట్ ఇవ్వబోతున్నాడు?.. అనే సందేహం సినీ మరియు మీడియా వర్గాలతోపాటు డార్లింగ్ ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. తాజాగా ఆ ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ ఏంటనేది రివీల్ అయిపోయింది.
రెబల్స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్లో ‘తానాజీ’ సినిమా డైరెక్టర్ ఓం రైత్ కాంబినేషన్లో సినిమా ఓ భారీ చిత్రం రూపొందనుంది.
చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాను రూ.350 కోట్ల బారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు.
ప్రస్తుతం ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ సినిమా చేయనున్నాడు డార్లింగ్.