గ్రాఫిక్స్‌కే 50 కోట్లంటే.. మరి సినిమాకి ఇంకెంతో!..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కబోయే సినిమా లేటెస్ట్ అప్‌డేట్..

  • Published By: sekhar ,Published On : March 20, 2020 / 04:09 PM IST
గ్రాఫిక్స్‌కే 50 కోట్లంటే.. మరి సినిమాకి ఇంకెంతో!..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కబోయే సినిమా లేటెస్ట్ అప్‌డేట్..

‘బాహుబలి’ సిరీస్, ‘సాహో’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సైతం పాన్‌ ఇండియా చిత్రంగానే ముస్తాబవుతోంది. అయితే ఇప్పుడు డార్లింగ్‌కి ఉన్న ఈ పాన్‌ ఇండియా ఇమేజ్‌ను పాన్‌ యూనివర్సల్‌ ఇమేజ్‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.

సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 50 వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో ఓ సినిమా నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా ఇది. ఓ విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముందని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ సినిమా విఎఫ్‌ఎక్స్‌ పనుల కోసమే దాదాపు రూ.50కోట్లకు పైగా భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు సమాచారం.

‘‘ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. కొతంమంది ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు. అది తప్పు.. ప్రభాస్ పాన్ ఇండియా ఎప్పుడో కొట్టేశారు.. ఇది పాన్ వరల్డ్ డార్లింగ్స్’’ అని సోషల్ మీడియా ద్వారా ఇంతకుముందే తెలిపారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. తండ్రి అశ్వనీదత్‌తో కలిసి  స్వప్నా దత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.