Prabhas : ఈ సంవత్సరం ప్రభాస్ మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడా??

 బాహుబలి నుంచి సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటున్నారు ప్రభాస్. రెండేళ్లకో సినిమా మహా అయితే సంవత్సరానికొకటి. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రభాస్ ఫాన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడమే..........

Prabhas : ఈ సంవత్సరం ప్రభాస్ మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడా??

Prabhas ready to release three movies in 2023

Prabhas :  బాహుబలి నుంచి సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటున్నారు ప్రభాస్. రెండేళ్లకో సినిమా మహా అయితే సంవత్సరానికొకటి. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రభాస్ ఫాన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు. వరసగా సినిమాలు రిలీజ్ చేస్తూ కెరీర్ లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రభాస్ ఫాన్స్ కి పండగే పండగ. ఈ సంవత్సరం ఏ స్టార్ హీరోకీ లేనన్ని రిలీజ్ లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్నాయి. బాహుబలి తర్వాత సినిమా రిలీజ్ కి బాగా టైమ్ తీసుకుంటున్న ప్రభాస్ ఈ సంవత్సరం వడ్డీతో కలిపి కొడతానంటున్నారు. బాహుబలి తర్వాత రెండేళ్లకు రిలీజ్ అయ్యింది సాహో, ఆ తర్వాత మూడేళ్లకు రిలీజ్ అయింది రాదేశ్యామ్. ఇలా సినిమా రిలీజ్ కి మినిమం రెండేళ్లు టైమ్ తీసుకుంటున్న ప్రభాస్ ఈ సంవత్సరం ఫాన్స్ కి ట్రిపుల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఈ సంవత్సరం 3 సినిమాలు రిలీజ్ చెయ్యబోతున్నారు.

ఈ సంవత్సరం 3 సినిమాల రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు ప్రభాస్. ఆల్రెడీ 4 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ షూట్ కంప్లీట్ చేసి మరో సారి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేశారు. జూన్ 16న రిలీజ్ అంటూ ఇంకా 150 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతోందంటూ రిమైండర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా మరోసారి కన్ఫామ్ చేసింది చిత్రయూనిట్. ఈ సంవత్సరం ఆదిపురుష్ తో పాటు మరో 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. జూన్ లో ఆదిపురుష్ రిలీజ్ అవుతోంటే సెప్టెంబర్ లో సలార్ రిలీజ్ కాబోతోంది. ప్రశాంత్ నీల్ , ప్రభాస్ కాంబినేషన్లో భారీగా తెరకెక్కుతున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ సెప్టెంబర్ 28న ధియేటర్లోకొస్తోంది. ఈ రిలీజ్ డేట్ ని ఇటీవలే నిర్మాత విజయ్ మరోసారి కన్ఫామ్ చేశారు.

Krithi Shetty : ‘కస్టడీ’లో రేవతి.. సక్సెస్ అవ్వాల్సిందే..

ప్రభాస్ ఆల్రెడీ సలార్, ప్రాజెక్ట్ Kతో ప్యార్లల్ షూట్ చేస్తూనే మరో వైపు మారుతి సినిమా కూడా మొదలుపెట్టేశారు. ఈ సినిమా కూడా ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతోంది అని సమాచారం. హార్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 3 హీరోయిన్లతో రొమాన్స్ చెయ్యబోతున్నారు ప్రభాస్. ఈ సినిమా మీద ఇంత వరకూ అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా ప్రభాస్, మారుతి సెట్స్ లోఉన్న ఫోటోతో ఫాన్స్ కి మాత్రం క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన ప్రభాస్ ఈ నెల లాస్ట్ వీక్ లో మూడో షెడ్యూల్ స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ కంప్లీట్ చేసి దసరా బరిలోకి లేదా ఇయర్ ఎండింగ్ కి దింపుదామని ప్లాన్ చేస్తున్నారు. మారుతి ఎలాగో ఫాస్ట్ గానే సినిమాలు చేస్తాడు కాబట్టి ఈ సినిమా కూడా కచ్చితంగా ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ సంవత్సరం ప్రభాస్ ఎలాగైనా మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడు, అభిమానులకి పండగే అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.