Prabhas : మరో ప్రాజెక్టుకి లైన్ క్లియర్ చేసిన ప్రభాస్.. ఈ లైనప్ ఏంటి బాబు..

లైన్ అప్ పెంచకుంటూ పోవడమే తప్ప తగ్గేదేలే అంటున్నారు ప్రభాస్. గ్లోబల్ స్టార్ గా ప్రమోట్ అయ్యాక బాలీవుడ్ బడా డైరెక్టర్స్ డార్లింగ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి..............

Prabhas : మరో ప్రాజెక్టుకి లైన్ క్లియర్ చేసిన ప్రభాస్.. ఈ లైనప్ ఏంటి బాబు..

Prabhas

Prabhas :  లైన్ అప్ పెంచకుంటూ పోవడమే తప్ప తగ్గేదేలే అంటున్నారు ప్రభాస్. గ్లోబల్ స్టార్ గా ప్రమోట్ అయ్యాక బాలీవుడ్ బడా డైరెక్టర్స్ డార్లింగ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడైతే ఓ సూపర్ డైరెక్టర్ తో బిగ్ మూవీకి కమిట్ మెంట్ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న పాన్ వరల్డ్ స్టార్ లిస్ట్ లో ఉన్న క్రేజీ క్రేజీ సినిమాల వెనుక మరో ఎక్జైటింగ్ ప్రాజెక్ట్ యాడ్ కానుంది. ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ తో డార్లింగ్ చేసే మూవీ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి సినిమాలు తీసి ప్రస్తుతం హృతిక్ తో ఫైటర్, షారుఖ్ తో పఠాన్ లాంటి యాక్షన్ ప్యాక్డ్ సబ్జెక్టులను తెరకెక్కిస్తున్నాడు సిద్దార్ధ్.

ప్రభాస్, సిద్దార్ధ్ ఆనంద్ కాంబినేషన్ మూవీని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ప్రభాస్, సిద్దార్ధ్ చేస్తోన్న సినిమాలు పూర్తయ్యాక మైత్రీ మూవీ మేకర్స్ ఈ కొత్త సినిమాను ప్రారంభిస్తోంది. పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత భారీ ప్రాజెక్ట్ చేయాలనుకుంటోన్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ప్రభాస్ సినిమాను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం వాళ్లు భారీగా ఖర్చు పెట్టేందుకు సైతం వెనుకాడట్లేదు.

అంటే సుందరానికి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి చిన్న సినిమాలతో పాటూ విజయ్ – సామ్ ఖుషి, చిరూ వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబో వంటి మీడియం బడ్జెట్ సినిమాలు, సుకుమార్ – బన్నీ పుష్ప ది రూల్, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ లాంటి మ్యాసివ్ ప్రాజెక్ట్స్ మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్నాయి. పాన్ వరల్డ్ స్టేటస్ కు తగ్గట్టు ప్రభాస్ కు అంతకు మించిన సినిమాను ఇవ్వాలనేది మైత్రీ వారి ప్లాన్. దానికి తగ్గట్టే సిద్దార్ధ్ ఆనంద్ లాంటి నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ తో డార్లింగ్ ను కలుపుతున్నారు. ముందైతే పుష్ప2తో కావాలిసినంత ట్రీట్ ఇచ్చి ప్రభాస్ మూవీ కోసం నార్త్ ఆడియెన్స్ ఎదురుచూసేలా చేయాలనేది మైత్రీ వారి ఆలోచన.

సిద్ధార్ధ్ ఆనంద్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు ఓ కొలిక్కి రావాలి. 2013 జనవరి 12న ఆయన శ్రీరామునిగా నటించిన ఆదిపురుష్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసారు ప్రభాస్. ఇంగ్లీష్ తో పాటూ వరల్డ్ వైడ్ 15 భాషల్లో ఆదిపురుష్ రిలీజ్ చేసేలా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను యమా స్పీడ్ గా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు ఓంరౌత్. నెవర్ బిఫోర్ రేంజ్ లో ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కట్టిపడేస్తాయనే హోప్స్ ఉన్నాయి.

ఆదిపురుష్ తర్వాత 2013 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు సలార్ రానుంది. ప్రస్తుతం ఈ సినిమాను పూర్తి చేసే పనిలోనే ఉన్నారు డార్లింగ్. సలార్ కోసం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు హోంబలే ఫిల్మ్ మేకర్స్. ఇంతకుముందు చూడని హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో గ్లోబల్ స్టార్ కనిపిస్తారనే అంచనాలున్నాయి. కేజీఎఫ్2తో నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయిన ప్రశాంత్ నీల్ సలార్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తారనే అంచానాలు ఉన్నాయి. డార్లింగ్ సలార్ ను ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ప్రభాస్ లిస్ట్ లో ఉన్న మరో పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ K. ఈ మూవీ షెడ్యూల్స్ ను ఫుల్ కాన్సట్రేషన్ తో పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. సైలెంట్ గా ప్రభాస్ తో పాటూ దీపికా పదుకోనే, అమితాబ్ లాంటి స్టార్స్ తో సీన్స్ పూర్తి చేస్తున్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ K సైన్స్ ఫిక్షన్ మూవీగా రానుంది. జూన్ నెలాఖారు నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ పూర్తి కానుంది. ఈమధ్యే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రిలీజ్ ఆర్డర్ లో లాస్ట్ కదా అంటూ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నామన్నారు నాగ్ అశ్విన్. ఈ డైరెక్టర్ కూడా ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారనే నమ్మకముండటంతో ప్రాజెక్ట్ Kపై అంచనాలు పెరిగాయి.

Sai Pallavi : హీరోయిన్స్‌లలో సాయిపల్లవి వేరయా..

సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ చేయనున్న సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది. ఆదిపురుష్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ స్పిరిట్ కోసం కూడా భారీగా ఖర్చు పెట్టేందుకు రెడీఅయ్యారు. సలార్, ప్రాజెక్ట్ K షూటింగ్ ఓ కొలిక్కి వస్తే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో మూవీని స్టార్ట్ చేస్తారు డార్లింగ్. ఈలోపు రణబీర్ తో పట్టాలెక్కించిన యానిమల్ ను సందీప్ పూర్తి చేస్తారు. ఇందులోనూ గ్లోబల్ స్టార్ ను ఎస్టాబ్లిష్ చేసేలా రాకింగ్ ఎలిమెంట్స్ ను సందీప్ రెడ్డి రాసుకున్నాడు.

మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా ఉంటుందన్నారు కానీ ఎప్పుడు మొదలవుతుంది అన్న దానిపై క్లారిటీ లేదు. సినిమా మొదలైనా పెద్ద సినిమాల గ్యాప్ లో ప్రభాస్ తో ఇచ్చే తక్కువ కాల్ షీట్స్ తో మారుతి ఈ సినిమా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు. ఏదేమైనా భారీ కా బప్ అనిపించే బడ్జెట్ తో ఓంరౌత్, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే సినిమాలు పూర్తయ్యాక సిద్ధార్ద్ ఆనంద్ తెరపైకి వస్తాడు. ఆ తర్వాత ఇంకేలాంటి క్రేజీ డైరెక్టర్స్ ప్రభాస్ తో వర్క్ చేస్తారన్నది ఇంకాస్త హీటెక్కిస్తోంది ప్రభాస్ ఫ్యాన్స్ ని.