Radhe Shyam: యూట్యూబ్‌లో మరో రికార్డ్ సెట్ చేసిన ప్రభాస్!

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియా లెవల్ లో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభాస్ నుండి వచ్చే ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలే. ఒకరకంగా బాలీవుడ్ హీరోలకు సమానంగా.. అంతకు మించి దక్షణాదిలో కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోగా ప్రభాస్ ఇప్పుడు మంచి జోరు మీదున్నాడు.

Radhe Shyam: యూట్యూబ్‌లో మరో రికార్డ్ సెట్ చేసిన ప్రభాస్!

Radhe Shyam (1)

Radhe Shyam: బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియా లెవల్ లో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభాస్ నుండి వచ్చే ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలే. ఒకరకంగా బాలీవుడ్ హీరోలకు సమానంగా.. అంతకు మించి దక్షణాదిలో కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోగా ప్రభాస్ ఇప్పుడు మంచి జోరు మీదున్నాడు. ఇప్పుడు ఆ హుషారే ఆయన సినిమాల మీద అప్ డేట్స్ తెలుసుకొనేందుకు కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

యూట్యూబ్ లో ప్రభాస్ ఇప్పుడు మరొక రికార్డు క్రియేట్ చేశాడు. బాలీవుడ్ సినిమాలను మించి ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాల ఇప్పటి నుండే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే. అప్పటి నుండే ఇటు సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ లో కూడా ఈ పోస్టర్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో ఇప్పుడు సరికొత్త రికార్డును సెట్ చేసింది.

ఇప్పటి వరకూ రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో 21 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఒక మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించడం ఇండియాలో ఇదే తొలిసారి. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ స్టార్ సినిమాలకు కూడా ఈవిధంగా వ్యూస్ రాలేదు. మోస్ట్ వ్యూడ్ మోషన్ పోస్టర్ గా రాధేశ్యామ్ ఇండియాలో రికార్డ్ సృష్టించింది. ఇది ఒకవిధంగా ప్రభాస్ మేనియాకు అద్దంపట్టేదిగా చెప్పుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.