Prabhas: బ్రేక్లోనే కానిచ్చేస్తానంటోన్న ప్రభాస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫెయిల్యూర్ నుండి...
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫెయిల్యూర్ నుండి బయటపడ్డ ప్రభాస్, ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ చిత్రాన్ని పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ‘ప్రాజెక్ట్ K’ను కూడా స్టార్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ రెండు సినిమాలకంటే ముందే, మరో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభిస్తారనే వార్తలు ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి.
Prabhas: రెబల్ స్టార్తో మారుతీ.. హీరోయిన్గా అనుష్క ఫిక్స్?
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో వార్త వినిపిస్తోంది. ఈ సినిమాను ముందుగా అనుకున్నట్లుగా ఇప్పట్లో ప్రారంభించడం కుదరదని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కోసం ఓ భారీ ఇంటి సెట్ను చిత్ర యూనిట్ రెడీ చేస్తోంది. ఈ సెట్లోనే మెజారిటీ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ను ఆగస్టులో ప్రారంభించాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడట. ఈలోపు మే నెలలో సలార్ నెక్ట్స్ షెడ్యూల్తో పాటు ప్రాజెక్ట్ Kను కూడా ప్రారంభించాలని ఆయన ఆలోచిస్తున్నాడు.
Prabhas: సోలోగా కానిచ్చేస్తున్న ప్రభాస్..?
ఇక ఈ రెండు సినిమాల షూటింగ్ను ఒకేసారి స్టార్ట్ చేసి, ఆగస్టు వరకు నిర్విరామంగా జరుపుకోవాలని ప్రభాస్ చూస్తున్నాడు. ఆగస్టులో కొంత గ్యాప్ తీసుకుని, అప్పుడు మారుతితో సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట. అయితే ఈ సినిమా షూటింగ్ను అతి తక్కువ సమయంలో పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో మారుతి అండ్ టీమ్ బిజీగా ఉన్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.