Balakrishna: బాలయ్య సరసన మరోసారి ప్రగ్యా జైస్వాల్.. దేనికో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. అయితే, ఇప్పుడు బాలయ్య సరసన మరోసారి ‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

Balakrishna: బాలయ్య సరసన మరోసారి ప్రగ్యా జైస్వాల్.. దేనికో తెలుసా..?

Pragya Jaiswal With Balakrishna Once Again

Balakrishna: నందమూరి బాలకృష్ణ రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. అయితే, ఇప్పుడు బాలయ్య సరసన మరోసారి ‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

Balakrishna: మూడు దశాబ్దాల తరువాత ఆ ఫీట్ సాధించిన బాలయ్య

బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ గతంలో ‘అఖండ’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య పక్కన ప్రగ్యా కనిపించనుందనే వార్తతో అభిమానులు ఒక్కసారిగా ఈ కాంబినేషన్ కోసం చూస్తున్నారు. అయితే ఈసారి ప్రగ్యా జైస్వాల్ బాలయ్య పక్కన కనిపించేది సినిమాలో కాదు.. ఓ యాడ్ కోసం వీరిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు.

Balakrishna : చెత్త సినిమాని అద్భుతంగా చేసేది వాళ్ళే.. మంచి సినిమాని చెడగొట్టేది వాళ్ళే.. బాలకృష్ణ!

గతంలో సాయి ప్రియా కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం బాలయ్య కొన్ని యాడ్స్ షూట్ చేశాడు. ఇప్పుడు తాజాగా మరో కమర్షియల్ బ్రాండ్‌ను ఆయన ఓకే చేశాడట. దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్‌లో ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి బాలయ్య పాల్గొన్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ యాడ్ షూటింగ్‌కు సంబంధించి ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక బాలయ్య నెక్ట్స్ మూవీని అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.