MAA Association: ప్రకాశ్ రాజ్ మరో బాంబ్..! బూతులు తిట్టారు.. గొడవలు చేశారు.. ఫుటేజ్ కావాలి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత హీట్ పుట్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
MAA Association: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత హీట్ పుట్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హోరాహోరీ పోరులో చివరకు ‘మా’ ఫైటింగ్లో మంచు విష్ణు విజయం సాధించాడు. ఎన్నికలు అయ్యాక అందరం ఒక్కటే అంటూ సినిమా నటులంతా చెప్పినా కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపణలు ఆపట్లేదు.
ఈ క్రమంలోనే ‘మా’ ఎన్నికల్లో మోహన్బాబు రౌడీయిజం, బూతులను హైలైట్ చేస్తూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్కు లేఖను రాశారు. ఎన్నికల్లో జరిగిన గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను ఇవ్వాలని కృష్ణమోహన్ను కోరారు. వీలైనంత త్వరగా గొడవకు సంబంధించిన ఫుటేజ్ ఇవ్వాలంటూ అభ్యర్థించారు. లేదంటే అది డిలీట్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ఫుటేజిని మార్చేసే ప్రమాదం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. కొందరు సభ్యలను శారీరకంగా గాయపరిచినట్లు ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మోహన్ బాబు, నరేష్ సభ్యులుపై దాడులు చేశారని, అన్ని చోట్లా సీసీ కెమెరాలు పెట్టారు కాబట్టి, ప్రతి ఒక్కరూ వ్యవహరించిన తీరు అందులో రికార్డ్ అవుతుందని, ఆ ఫుటేజ్ బయటకు వస్తే అన్నీ విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో గతంలో తీర్పులు ఇచ్చి ఉందని, కచ్చితంగా మాకు సహకరిస్తారని భావిస్తున్నాను అంటూ లేఖలో రాశారు ప్రకాష్ రాజ్. ఇదిలా ఉంటే, సీసీ ఫుటేజ్ అడుగుతూ ప్రకాష్ రాజ్ రాసిన లేఖపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. సీసీ టీవీ ఫుటేజ్ మా ఆఫీసులో భద్రంగానే ఉందని, నిబంధనల ప్రకారం ఎవరడిగినా సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
Seeking justice… my letter to #Maaelections election officer #justasking pic.twitter.com/3P0ex1VOIf
— Prakash Raj (@prakashraaj) October 14, 2021