Prakash Raj: వైఎస్ జగన్ మీ బంధువైతే “మా” ఎన్నికలకు వస్తారా? ఓటేయిస్తారా?

ఓ వైపు మంచు విష్ణు ప్యానెల్ దూకుడుగా ప్రచారం చేస్తుండగా.. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ వేగంగా మీటింగ్‌లు పెట్టుకుంటూ ఓటర్లను కలుపుకుంటూ పోయే ప్రయత్నం చేస్తుంది.

Prakash Raj: వైఎస్ జగన్ మీ బంధువైతే “మా” ఎన్నికలకు వస్తారా? ఓటేయిస్తారా?

Prakash Raj

ప్రతి ఒక్కడు మగాడే ఇక్కడ.. ఒళ్లు దగ్గరపెట్టుకోండి..!

Prakash Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో “మా” ఎన్నికలు హీటెక్కింది. ఓ వైపు మంచు విష్ణు ప్యానెల్ దూకుడుగా ప్రచారం చేస్తుండగా.. మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ వేగంగా మీటింగ్‌లు పెట్టుకుంటూ ఓటర్లను కలుపుకుంటూ పోయే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాన అభ్యర్థులుగా ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల విమర్శలు ఘాటెక్కాయి. లేటెస్ట్‌గా ఎఫ్ఎన్‌సీసీలో జరిగిన లంచ్ మీట్‌లో ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మా ఎన్నికల్లో ఎలాంటి పెద్దల ఆశీర్వాదం నాకొద్దని చెప్పిన ప్రకాష్ రాజ్.. మేం ప్రశ్నించకపోతే ఈసారి ఎన్నికలు ఉండేవి కావన్నారు. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారని, నేను ఒక ఉత్తరం రాస్తే మా అసోసియేషన్‌కు తాళం పడేదన్నారు. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తెలుసునన్న ప్రకాష్ రాజ్.. మా ఎన్నికల్లో వైఎస్ జగన్, కేసీఆర్, బీజేపీలను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు.

వైఎస్ జగన్ మీ బంధువైతే “మా” ఎన్నికలకు వస్తారా? ఓటేయిస్తారా? అని ప్రశ్నించారు. రెండు సార్లు హలో చెబితే కేటీఆర్ ఫ్రెండ్ అయిపోతారా? అని నిలదీశారు. మీరు గెలవడానికి ప్రయత్నించండి, అవతలివారిని ఓడించడానికి కాదన్నారు ప్రకాష్ రాజ్. నరేష్ అహంకారియని, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలన్నారు ప్రకాష్ రాజ్.

మా అసోసియేషన్ సుగ్గుపడేలా నరేష్ ప్రవర్తిస్తున్నారని, శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తున్నానంటోన్న నరేష్ చక్రం దొబ్బేశామని అన్నారు. చాలా బాధతో, ఆక్రోశంతో మాత్రమే సమస్యలను పరిష్కరించాలని పోటీ చేస్తున్నామని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. కొంచెం కోపం, బాధతో వేసే ఓటు సునామిలో మంచు విష్ణు కొట్టుకుపోవాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు.