YS Jagan Biopic : క్రేజీ అప్‌డేట్.. జగన్ క్యారెక్టర్‌లో ప్రతీక్ గాంధీ..

వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి బయోపిక్ చెయ్యబోతున్నారు మహి వి. రాఘవ్..

YS Jagan Biopic : క్రేజీ అప్‌డేట్.. జగన్ క్యారెక్టర్‌లో ప్రతీక్ గాంధీ..

Pratik Gandhi In Ys Jagan Mohan Reddy Biopic

YS Jagan Biopic: సౌత్ ఇండియాలో బయోపిక్స్ హవా కంటిన్యూ అవుతోంది. సినీ, పొలిటికల్, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ రియల్ లైఫ్‌‌ని బేస్ చేసుకుని తెరకెక్కించే సినిమాలకుండే క్రేజే వేరు. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్స్ మాగ్జిమమ్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రెస్టీజియస్ బయోపిక్ రాబోతుంది.

Yatra

స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా తీసి సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ మహి వి. రాఘవ్ ఈ సినిమాకి సీక్వెల్ చేస్తానని చెప్పారు. కట్ చేస్తే ‘యాత్ర 2’ కంటే ముందు మరో బయోపిక్ రూపొందిచాలని ఫిక్స్ అయ్యారు. వైఎస్సార్ తనయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి బయోపిక్ చెయ్యబోతున్నారు మహి వి. రాఘవ్. జగన్ క్యారెక్టర్ కోసం ‘స్కామ్ 1992’ థ్రిల్లర్ సిరీస్‌లో తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రతీక్ గాంధీ నటించనున్నాడు.

Pratik Gandhi

డైరెక్టర్ నేరేట్ చేసిన గ్రిప్పింగ్ స్టోరీ, క్యారెక్టర్‌కి ప్రతీక్ ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పేశాడట. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ సొంతగా పార్టీ పెట్టడం, పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లడం, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హిస్టారికల్ విన్నింగ్ సాధించడం వంటివి సంఘటనలు బయోపిక్‌లో చూపించనున్నారు.

Mahi V Raghav

పేద ప్రజలకు అండగా నిలుస్తూ, తండ్రికి తగ్గ తనయుడిగా, యూత్‌కి ఐకాన్‌గా నిలిచిన జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనున్నామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే ప్లాన్స్ జరుగుతున్నాయని డైరెక్టర్ మహి వి. రాఘవ్ చెప్పారు. ‘ఆనందోబ్రహ్మా’, ‘యాత్ర’ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన యంగ్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్.. విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి, 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద జగన్ బయోపిక్‌ని నిర్మించనున్నారు.

Ys Jagan