ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ : చిరు చేతుల మీదుగా రేఖ, శ్రీదేవిలకు పురస్కారాలు
ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ కార్యక్రమం నవంబర్ 17, సాయంత్రం 5 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరుగనుంది..
ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ కార్యక్రమం నవంబర్ 17, సాయంత్రం 5 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరుగనుంది..
నటసామ్రట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ కార్యక్రమం నవంబర్ 17, సాయంత్రం 5 గంటలకు, అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరుగనుంది.
ఆ విశేషాలను తెలియచేయటానికి కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి, అక్కినేని నాగార్జున విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. 2018వ సంవత్సరానికి గానూ అతిలోక సుందరి, స్వర్గీయ శ్రీదేవి, 2019వ సంవత్సరానికి రేఖ ఈ అవార్డ్కి ఎంపిక చేశారు.
Read Also : రవితేజ ‘క్రాక్’ ప్రారంభం
శ్రీదేవి అవార్డును ఆమె భర్త బోనీ కపూర్ అందుకోనున్నారు. ఆయనతో పాటు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కుడా హాజరు కానున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, అవార్డులను అందచేయనున్నారు.