OTTల్లో రిలీజ్‌కు మోహన్‌లాల్ దృశ్యం 2

OTTల్లో రిలీజ్‌కు మోహన్‌లాల్ దృశ్యం 2

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా సూపర్‌హిట్. అదే మాతృకగా తీసుకుని పలు భాషల్లో రీమేక్ చేసినా హిట్టే.. ఇది దృష్టిలో ఉంచుకునే దాని సీక్వెల్ కు రెడీ అయింది సినిమా యూనిట్. కాకపోతే కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్ వల్ల లేట్ కావడంతో సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలవడానికి చాలా సమయమే పట్టింది.

ఇప్పుడు ఈ సినిమాను ఇదే సంవత్సరం రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిజిటల్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా టీజర్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ టీజర్ లో మోహన్ లాల్ పోషించిన క్యారెక్టర్ జార్జ్‌కుట్టీ ఓ పోలీసాఫీసర్ తో మాట్లాడుతూ.. ఈ కొత్త పోలీస్ స్టేషన్ నా కుటుంబాన్ని కాపాడుతుందనుకుంటున్నా. అని అంటాడు. పోలీస్ స్టేషన్ ఫ్లోర్ కింద పాతిపెట్టిన సీక్రెట్ గురించి మాట్లాడుతూ.. అలా అంటాడు.

‘దృశ్యం (2013) సినిమా అదొక థ్రిల్లర్ నేపథ్యమున్న సినిమా. సమయంతో పాటు దానిపై ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఎక్కడైతే వదిలేశామో అక్కడి నుంచి జార్జికుట్టీ కుటుంబ కథ మొదలవుతుంది’ అని మోహన్ లాల్ అన్నారు.

సీక్వెన్స్ కోసం అభిమానులు సహనంతో ఎదురుచూస్తున్నారని తెలుసు… ప్రేమతో మిళితమై ఉన్న కథపై ఇంకా అంచనాలు పెంచాలనుకుంటున్నాం. ఇక ఇంట్లోనే కూర్చొని మీ వాళ్లందరితో కలిసి సేఫ్‌గా సినిమా చూడండి’ అని మోహన్ లాల్ ముగించారు. ఈ సినిమా కథను రాసిన జీతూ జోసెఫ్ డైరక్షన్ కూడా చేస్తున్నారు. ప్రధాన పాత్రల్లో మీనా, సిద్దిఖీ, ఆశా శరత్, మురళీ గోపీ, అన్సిబా, ఎస్తేర్, సాయికుమార్ నటిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది రిలీజ్ అవనుందని అనౌన్స్‌మెంట్ ఇవ్వగా.. కొందరు హ్యాపీ అయినా మరికొందరికీ నచ్చడం లేదు. ‘OTT రిలీజ్ అసహనానికి గురి చేస్తుంది. అసంతృప్తిగా ఉన్నాం ఈ నిర్ణయానికి థియేటర్లలో రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం. థియేటర్ స్క్రీన్లపై చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలనుకుంటే ఇలా చేశారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.