Priyamani Husband : ప్రియమణితో నా భర్త పెళ్లి అక్రమం.. మొదటి భార్య అయేషా ఆరోపణలు..
తన భర్తపై మొదటి భార్య చేసిన ఆరోపణల గురించి ప్రియమణి ఎలా స్పందిస్తుందో చూడాలి..
Priyamani Husband: హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో యాక్ట్ చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. కొద్దికాలంగాి తెలుగులో ఓ పాపులర్ రియాలిటీ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. ఫ్యామిలీ మెన్ సిరీస్ తనకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. వెంకటేష్తో నటించిన ‘నారప్ప’ ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకోవడమే కాకుండా ప్రియమణి చేసిన సుందరమ్మ క్యారెక్టర్కి చక్కటి రెస్పాన్స్ వచ్చింది.
Narappa : విక్టరీ వెంకటేష్ వన్మెన్ షో ‘నారప్ప’..
కాస్త గ్యాప్ వచ్చినా ప్రొఫెషనల్ లైఫ్ అయితే బాగానే ఉంది కానీ పర్సనల్ లైఫ్లో భర్త కారణంగా వార్తల్లో నిలిచింది ప్రియమణి. 2017లో కేరళకు చెందిన బిజినెస్మెన్ ముస్తఫా రాజ్ను ప్రేమించి పెళ్లాడింది ప్రియమణి. అప్పటికే అతనికి భార్య అయేషా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్ఫర్థలు రావడంతో 2010 నుండే విడివిడిగా ఉంటున్నారు.
అయితే ప్రియమణిని పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య అయేషా, పిల్లల కోసం ప్రతి నెలా కొంత అమౌంట్ పంపిస్తూ వస్తున్నాడు ముస్తఫా.