Producer Niranjan Reddy : చిరంజీవి, చరణ్, కొరటాల శివ డబ్బులు తీసుకోకుండా సినిమా చేశారు

ఈవెంట్ లో నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ''టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్. చిన్న రోల్ అయినా పూజా హెగ్డేని అడగగానే వచ్చి చేసినందుకు థ్యాంక్స్. నా చిన్నప్పుడు........

Producer Niranjan Reddy : చిరంజీవి, చరణ్, కొరటాల శివ డబ్బులు తీసుకోకుండా సినిమా చేశారు

Niranjan

Producer Niranjan Reddy :  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.

 

ఈ ఈవెంట్ లో నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ”టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్స్. చిన్న రోల్ అయినా పూజా హెగ్డేని అడగగానే వచ్చి చేసినందుకు థ్యాంక్స్. నా చిన్నప్పుడు తమిళ్ సినిమాలు తెలుగులో బాగా ఆడేవి అప్పుడు అనుకునే వాడ్ని తెలుగు సినిమాలు ఇంకా పెద్దగా ఉండవా అని. రాజమౌళి గారు బాహుబలితో అది తీర్చేసి ఇండియాలోనే తెలుగు సినిమాని నిలబెట్టారు. కొరటాల శివ నాతో ఒక సినిమా చేద్దాం అన్నయ్య అని అడిగి ఇంత పెద్ద సినిమా చేశారు. థ్యాంక్ యు శివ గారు. వ్యాల్యూస్ తో కలిపి సినిమాలు తీస్తారు. ఈ సినిమాని సెట్ చేసినందుకు థ్యాంక్ యు. నాకు ఈ సినిమాతో చరణ్ లాంటి తమ్ముడు దొరికాడు. చరణ్ కూడా స్టోరీ విని ఆశ్చర్యపోయాడు. ఆర్ఆర్ఆర్ లో చరణ్ ని చూసిన తర్వాత ఇందులో చరణ్ ఏ మాత్రం తగ్గడు. చిరంజీవి గారితో నాకు అంతకు ముందు పరిచయం లేదు. ఈ సినిమాతోనే పరిచయం. 1991లో మా ఊరు నిర్మల్ లో ఒక థియేటర్ ఓపెనింగ్ కి చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు దాదాపు 4 లక్షల మంది జనాలు వచ్చారు. రోడ్లన్నీ నిండిపోయాయి. అప్పుడు అనిపించింది చిరంజీవి గారు ఎంత పెద్ద స్టారో అని. అప్పుడు చిరంజీవి గారిని కలిస్తే చాలు అనుకునే వాడ్ని. ఇప్పుడు ఆయనతో సినిమా తీశాను. ఈ సినిమాకి చిరంజీవి, చరణ్, కొరటాల శివ డబ్బులు తీసుకోలేదు. సినిమా అవ్వనివ్వండి డబ్బులు వచ్చాక తీసుకుంటాం అని అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ రేంజ్ లో ఉందంటే చిరంజీవి గారే కారణం” అని అన్నారు.

Mohana Raja : వారసత్వం అంటే పదవి కాదు భాద్యత.. రామ్ చరణ్ ప్రతి రోజు అది ప్రూవ్ చేసుకుంటున్నారు..

ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.