బీజేపీలో స్టార్ పవర్ : కాషాయ కండువా కప్పుకున్న దలేర్ మెహందీ
బీజేపీలో స్టార్ పవర్ పెరిగిపోతోంది. ఈ పార్టీలో చేరడానికి సినీ నటులు క్యూ కడుతున్నారు. సినీ నటులే కాదు..ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే సన్నీ డియోల్, హన్స్ రాజ్ హాన్స్, క్రికేటర్ గౌతం గంభీర్లు కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన పంజాబీ పాటలతో ప్రేక్షకులను రంజిప చేశాడు ఈ సింగర్.
ఏప్రిల్ 26వ తేదీ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి విజయ్ గోయెల్, హన్స్ రాజ్ హన్స్ సమక్షంలో దలేర్ మెహందీ బీజేపీలో చేరారు. పార్టీలో చేరనైతే చేరారు..కానీ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? అనేది తెలియరాలేదు. హన్స్రాజ్ కుమారుడితో మెహందీ కుమార్తె వివాహం జరిగిన విషయం తెలిసిందే.
తెలుగు, తమిళం, ఒరియా, హిందీ భాషల్లో దలేర్ మెహందీ అనేక పాటలు పాడారు. ప్రైవేట్ ఆల్బమ్ల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. బోలో తారారార.. పాట ఒక ఊపు ఊపింది.