Pushpa : ఆ రాష్ట్రంలో పుష్ప రీ రిలీజ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చేస్తూ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "పుష్ప - ది రైస్". ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇక విషయానికి వస్తే అల్లు అర్జున్ కి కేరళలో కూడా తెలుగుతో సమానంగా అభిమానులు సంపాదించుకున్నాడు. తాజాగా...

Pushpa : ఆ రాష్ట్రంలో పుష్ప రీ రిలీజ్..

Pushpa Re Release in Kerala State

Pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చేస్తూ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం “పుష్ప – ది రైస్”. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ‘తగ్గేదేలే’ అనే మ్యానరిజం ప్రపంచం మొత్తని ఆకర్షించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ వంటి హేమాహేమీలు ముఖ్యపాత్రలో కనిపించారు.

Pushpa 2: సుకుమార్ ఆలోచనలు అర్థం కావడం లేదంటోన్న ఫ్యాన్స్..!

ఇక విషయానికి వస్తే అల్లు అర్జున్ కి కేరళలో కూడా తెలుగుతో సమానంగా అభిమానులు సంపాదించుకున్నాడు. మలయాళంలో కూడా ఈ హీరో ప్రతి మూవీ విడుదల కావాల్సిందే. అక్కడి అభిమానులు బన్నీని ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. తాజాగా పుష్ప-1 విడుదలయ్యి డిసెంబర్ 17కి ఏడాది కావడంతో.. ఆ రోజున సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేయడానికి కేరళ అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇందుకోసం పెద్దఎత్తులో థియేటర్లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇటీవల పుష్ప-2 అప్డేట్ కోసం అభిమానులు ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలియజేసిన సంగతి మనందరకి తెలిసిందే. అయితే అవతార్-2 సినిమా విడుదల సమయంలో పుష్ప – ది రూల్ టీజర్ ని ప్రదర్శించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో విస్తృతంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.