రాగల 24 గంటల్లో : నవంబర్ 15 విడుదల

సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రాగల 24 గంటల్లో’ నవంబర్ 15 విడుదల..

  • Published By: sekhar ,Published On : October 31, 2019 / 10:46 AM IST
రాగల 24 గంటల్లో : నవంబర్ 15 విడుదల

సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రాగల 24 గంటల్లో’ నవంబర్ 15 విడుదల..

సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్), ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా.. ‘రాగల 24 గంటల్లో’.. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా టీజర్, ఇటీవల రిలీజ్ చేసిన ప్రమోషనల్ సాంగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.. నవంబర్ 15న సినిమాను విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు.
రాగల 24 గంటల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయని తెలిసినప్పుడు ఎవరెలా స్పందించారు, అసలు ఆ 24 గంటల్లో ఏం జరిగింది అనే అంశాలతో ఆసక్తికరంగా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ టీమ్ చెప్తుంది.

Read Also : మళ్లీ కన్నుకొట్టింది : కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది

ఇప్పటివరకు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి థ్రిల్లర్ సినిమా చేస్తుండడం విశేషం. తమిళ హీరో శ్రీరామ్ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. మాటలు : కృష్ణభగవాన్, సంగీతం : రఘుకుంచె, లిరిక్స్ : భాస్కరభట్ల, శ్రీమణి, కెమెరా : అంజి, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : చిన్నా.